MARQUEE

URGENT IMPORTANT APPEAL ACT ( Association for Computer Teachers ) అనే ఉద్యమం కంప్యూటర్ టీచర్లతో శ్రీకాకుళం లో నెమ్మదిగా ప్రారంభమయినది . 2011 జూలై 10వ తేదిన ఆవిర్భవించింది. సభ్యుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసింది. ఇతర సంఘాలతో భుజం కలిపి పోరాడింది. సమ్మెలకు ఉద్యమాలకు మారుపేరుగా నిలిచింది. కోర్దినేటర్ల వేధింపులకు ఏజెన్సీల మోసాలకు ఎదురు తిరిగింది. ఈ క్రమంలో అనేక మంది సభ్యులు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అన్ని జిల్లాలకు, రాష్ట్రమంతట ACT పేరు మారుమ్రోగింది. నిజాయితీకి నిర్భీతికి చిరునామాగా మారింది కనుకనే రాష్ట్ర స్థాయి సంఘంగా మారింది. చాలిచాలని జీతాలతో బ్రతుకులు ఈడుస్తున్న మన కంప్యూటర్ టీచర్ల దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పనిచేయ్య్లనేదే ACT ఉద్దేశ్యం. అందరి ఉపాధ్యాయుల వలె కంప్యూటర్ టీచర్లు గౌరవప్రదంగా జీవించాలనేదే ACT కర్తవ్యం. అందుకే ఏ రొజూ సభ్యుల నుంచి పైసాకుడా వసూలు చెయ్యలేదు. ఇకముందు కూడా వసూలు చెయ్యదు. వసులూ చేసే అధికారాన్ని ACT ఎవరికీ ఇవ్వలేదు. ACT పేరుతొ వస్తున్న ఈ మెయిల్స్ మరియు SMS లకు ఎవరు స్పందిచ వద్దని ఎవరికీ డబ్బులు చెల్లించవద్దని ACT STATE COMMITTEE కోరుతోంది ACT చందాలకు, వసూళ్ళకు, సభ్యత్వ రుసుములకు వ్యతిరేకం జై కంప్యూటర్ టీచర్ !!! జై జై ACT !!!

Tuesday, February 25, 2014

అంగన్ వాడీలను చర్చలకు పిలిచిన సీఎస్ ? Posted on: Mon 24 Feb 16:09:44.393796 2014


హైదరాబాద్ : అంగన్ వాడీ పోరాటానికి ప్రభుత్వం తలొగ్గుతున్నట్లు కనిపిస్తోంది. న్యాయబద్ధమైన డిమాండ్ లను తీర్చాలని కోరుతూ లక్షలాది మంది అంగన్ వాడీలు ఇందిరాపార్కు వద్ద మహా ధర్నా చేస్తున్న సంగతి తెలిసిందే. వీరిపై పోలీసులు ప్రతాపం చూపడంతో అంగన్ వాడీ కార్యకర్తలు తమ పోరాటాన్ని ఉధృతం చేశారు. ఎక్కడికక్కడనే బైఠాయించారు. కార్యకర్తలను అరెస్టు చేసిన వాహనాలు వెళ్లకుండా రహదారులపై పడుకున్నారు. ఎండ వేడికి లెక్కచేయకుండా కూర్చొవడంతో పోలీసులు చేతులెత్తేశారు. పోలీసుల వైఖరి పట్ల అన్ని వైపుల నుండి విమర్శలు వచ్చాయి. తమ సమస్యలు తీర్చకుండా ఇక్కడినుండి కదిలేది లేదని అంగన్ వాడీలు భీష్మీంచుకూర్చొన్నారు. ఎక్కడికక్కడ అంగన్ వాడీలు బైఠాయించడంతో తీవ్ర ఉద్రిక్త నెలకొంది. దీనితో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చర్చలకు పిలిచినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి సమాచారం మాత్రం రాలేదు. కొద్ది గంటల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

No comments: