MARQUEE

URGENT IMPORTANT APPEAL ACT ( Association for Computer Teachers ) అనే ఉద్యమం కంప్యూటర్ టీచర్లతో శ్రీకాకుళం లో నెమ్మదిగా ప్రారంభమయినది . 2011 జూలై 10వ తేదిన ఆవిర్భవించింది. సభ్యుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసింది. ఇతర సంఘాలతో భుజం కలిపి పోరాడింది. సమ్మెలకు ఉద్యమాలకు మారుపేరుగా నిలిచింది. కోర్దినేటర్ల వేధింపులకు ఏజెన్సీల మోసాలకు ఎదురు తిరిగింది. ఈ క్రమంలో అనేక మంది సభ్యులు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అన్ని జిల్లాలకు, రాష్ట్రమంతట ACT పేరు మారుమ్రోగింది. నిజాయితీకి నిర్భీతికి చిరునామాగా మారింది కనుకనే రాష్ట్ర స్థాయి సంఘంగా మారింది. చాలిచాలని జీతాలతో బ్రతుకులు ఈడుస్తున్న మన కంప్యూటర్ టీచర్ల దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పనిచేయ్య్లనేదే ACT ఉద్దేశ్యం. అందరి ఉపాధ్యాయుల వలె కంప్యూటర్ టీచర్లు గౌరవప్రదంగా జీవించాలనేదే ACT కర్తవ్యం. అందుకే ఏ రొజూ సభ్యుల నుంచి పైసాకుడా వసూలు చెయ్యలేదు. ఇకముందు కూడా వసూలు చెయ్యదు. వసులూ చేసే అధికారాన్ని ACT ఎవరికీ ఇవ్వలేదు. ACT పేరుతొ వస్తున్న ఈ మెయిల్స్ మరియు SMS లకు ఎవరు స్పందిచ వద్దని ఎవరికీ డబ్బులు చెల్లించవద్దని ACT STATE COMMITTEE కోరుతోంది ACT చందాలకు, వసూళ్ళకు, సభ్యత్వ రుసుములకు వ్యతిరేకం జై కంప్యూటర్ టీచర్ !!! జై జై ACT !!!

Thursday, March 6, 2014

‘ఇన్‌టైమ్ సర్వీసు’కు కాంట్రాక్టు రద్దు

Sakshi | Updated: March 05, 2014 02:29 (IST)
శ్రీకాకుళం, న్యూస్‌లైన్ : జిల్లాలోని కస్తూర్బాగాంధీ విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను కాంట్రా క్టు పద్ధతిపై భర్తీ చేసేందుకు ఇన్‌టైమ్ సర్వీసు సంస్థకు ఇచ్చిన కాంట్రాక్టును కలెక్టర్ సౌరభ్‌గౌర్ రద్దు చేశారు. ఈ సంస్థ అక్రమాలకు పాల్పడుతున్నట్లు ‘సాక్షి’లో కథనం ప్రచురితం కావడంతో స్పందించిన ఆయన ఈ మేరకు నిర్ణయించారు. తిరిగి ప్రకటన వెలువరించాలని ఆర్‌వీఎం అధికారులకు ఆదేశించారు.
ఎఫ్‌ఏవో సరెండర్ సాధ్యమేనా? 
ఇదే విషయంలో ఎఫ్‌ఏవో ప్రముఖ పాత్ర వహించారని కలెక్టర్ గట్టి నమ్మకానికి వచ్చి ఆయనను సరెండర్ చేయాలని పీఓకు ఆదేశించినా అది సాధ్యమయ్యే పనేనా అని పలువురు చర్చించుకుంటున్నారు. జి.రాజు అనే ఖజానా శాఖ ఉద్యోగి అయిదేళ్ల క్రితం డిప్యుటేషన్‌పై రాజీవ్ విద్యామిషన్‌కు వచ్చారు. డిప్యుటేషన్ మూడేళ్లతో ముగియాల్సి ఉన్నప్పటికీ ఫారెన్ సర్వీసెస్ సౌలభ్యం రావడంతో అయిదేళ్లు వరకు ఉండే అవకాశం వచ్చింది. 
ఈ కాలంలో ఆయన పదోన్నతులు సైతం వదులుకున్నారు. అయిదేళ్ల గడువు ముగిసిన తరువాత పదోన్నతి పొంది ఖజానా శాఖలో ఒకటి, రెండు రోజులు పనిచేసి మళ్లీ ఆర్‌వీఎంకు డిప్యుటేషన్ వేయించుకున్నారు. దీనివల్ల కొత్తగా డిప్యుటేషన్‌పై నియమించినట్లు అయింది. అందువల్ల ఎఫ్‌ఏఓను సరెండర్ చేయడం సాధ్యం కాదని పలువురు అభిప్రాయపడుతుండగా ఛైర్మన్ హోదాలో కలెక్టర్ ఏ స్థాయి అధికారినైనా సరెండర్ చేసే అధికారం ఉందని ఇంకొందరు ఉద్యోగులు చెబుతున్నారు. ఈ విషయంలో ఏం జరుగుతుందో మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

No comments: