MARQUEE

URGENT IMPORTANT APPEAL ACT ( Association for Computer Teachers ) అనే ఉద్యమం కంప్యూటర్ టీచర్లతో శ్రీకాకుళం లో నెమ్మదిగా ప్రారంభమయినది . 2011 జూలై 10వ తేదిన ఆవిర్భవించింది. సభ్యుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసింది. ఇతర సంఘాలతో భుజం కలిపి పోరాడింది. సమ్మెలకు ఉద్యమాలకు మారుపేరుగా నిలిచింది. కోర్దినేటర్ల వేధింపులకు ఏజెన్సీల మోసాలకు ఎదురు తిరిగింది. ఈ క్రమంలో అనేక మంది సభ్యులు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అన్ని జిల్లాలకు, రాష్ట్రమంతట ACT పేరు మారుమ్రోగింది. నిజాయితీకి నిర్భీతికి చిరునామాగా మారింది కనుకనే రాష్ట్ర స్థాయి సంఘంగా మారింది. చాలిచాలని జీతాలతో బ్రతుకులు ఈడుస్తున్న మన కంప్యూటర్ టీచర్ల దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పనిచేయ్య్లనేదే ACT ఉద్దేశ్యం. అందరి ఉపాధ్యాయుల వలె కంప్యూటర్ టీచర్లు గౌరవప్రదంగా జీవించాలనేదే ACT కర్తవ్యం. అందుకే ఏ రొజూ సభ్యుల నుంచి పైసాకుడా వసూలు చెయ్యలేదు. ఇకముందు కూడా వసూలు చెయ్యదు. వసులూ చేసే అధికారాన్ని ACT ఎవరికీ ఇవ్వలేదు. ACT పేరుతొ వస్తున్న ఈ మెయిల్స్ మరియు SMS లకు ఎవరు స్పందిచ వద్దని ఎవరికీ డబ్బులు చెల్లించవద్దని ACT STATE COMMITTEE కోరుతోంది ACT చందాలకు, వసూళ్ళకు, సభ్యత్వ రుసుములకు వ్యతిరేకం జై కంప్యూటర్ టీచర్ !!! జై జై ACT !!!

Sunday, February 16, 2014

కార్మికుల సమస్యలు పరిష్కరించాలి : నాగేశ్వర్

కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి : నాగేశ్వర్
15:03 - February 15, 2014
01:07
హైదరాబాద్ : ప్రభుత్యోద్యోగులతో సమానంగా ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులకు కూడా మధ్యంతర భృతిని చెల్లించాలని ఎమ్మెల్సీ ప్రొ. నాగేశ్వర్ అన్నారు. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు శనివారం సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ, ప్రొ. కె.నాగేశ్వర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కార్మికుల సమస్యలను పరిష్కరించకుంటే ఈ నెల 20 నుండి సమ్మె తలపెట్టనున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వం ప్రభుత్యోద్యోగులందరికీ ఇంటరిమ్ రిలీఫ్ ఇచ్చిందని గుర్తుచేశారు. 20 ఏళ్లుగా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులు కూడా ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్నారని తెలిపారు. ప్రభుత్యోద్యోగులతో సమానంగా వీరికీ ఐఆర్ వర్తింపజేయాలని కోరారు.

No comments: