MARQUEE

URGENT IMPORTANT APPEAL ACT ( Association for Computer Teachers ) అనే ఉద్యమం కంప్యూటర్ టీచర్లతో శ్రీకాకుళం లో నెమ్మదిగా ప్రారంభమయినది . 2011 జూలై 10వ తేదిన ఆవిర్భవించింది. సభ్యుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసింది. ఇతర సంఘాలతో భుజం కలిపి పోరాడింది. సమ్మెలకు ఉద్యమాలకు మారుపేరుగా నిలిచింది. కోర్దినేటర్ల వేధింపులకు ఏజెన్సీల మోసాలకు ఎదురు తిరిగింది. ఈ క్రమంలో అనేక మంది సభ్యులు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అన్ని జిల్లాలకు, రాష్ట్రమంతట ACT పేరు మారుమ్రోగింది. నిజాయితీకి నిర్భీతికి చిరునామాగా మారింది కనుకనే రాష్ట్ర స్థాయి సంఘంగా మారింది. చాలిచాలని జీతాలతో బ్రతుకులు ఈడుస్తున్న మన కంప్యూటర్ టీచర్ల దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పనిచేయ్య్లనేదే ACT ఉద్దేశ్యం. అందరి ఉపాధ్యాయుల వలె కంప్యూటర్ టీచర్లు గౌరవప్రదంగా జీవించాలనేదే ACT కర్తవ్యం. అందుకే ఏ రొజూ సభ్యుల నుంచి పైసాకుడా వసూలు చెయ్యలేదు. ఇకముందు కూడా వసూలు చెయ్యదు. వసులూ చేసే అధికారాన్ని ACT ఎవరికీ ఇవ్వలేదు. ACT పేరుతొ వస్తున్న ఈ మెయిల్స్ మరియు SMS లకు ఎవరు స్పందిచ వద్దని ఎవరికీ డబ్బులు చెల్లించవద్దని ACT STATE COMMITTEE కోరుతోంది ACT చందాలకు, వసూళ్ళకు, సభ్యత్వ రుసుములకు వ్యతిరేకం జై కంప్యూటర్ టీచర్ !!! జై జై ACT !!!

Sunday, April 21, 2013

21-04-13


ఐటి అభివృద్ధితో 6.20 కోట్ల ఉద్యోగాలు : మంత్రి కిల్లి

ప్రజాశక్తి - అన్నవరం   Fri, 19 Apr 2013, IST  
కేంద్ర ప్రభుత్వం ఐటి రంగాన్ని అభివృద్ధి చేసేందుకు విధానాలు రూపొందించడంతో 2020 నాటికి 6.20 కోట్ల ఉద్యోగాలు లభిస్తాయని కేంద్ర ఐటి కమ్యూనికేషన్ల సహాయమంత్రి పిల్లి కృపారాణి చెప్పారు. గురువారం తూర్పు గోదావరి జిల్లా అన్నవరం కొండపైకి వచ్చిన మంత్రి కుటుంబ సభ్యులకు దేవస్థానం ఈఓ పి.వెంకటేశ్వర్లు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వినాయక అతిథి గృహంలో మంత్రి విలేకర్లతో మాట్లాడారు. త్వరలో హైదరాబాదులో ఐటి కేంద్రాన్ని ప్రారంభిస్తున్నామని తెలిపారు. దీనివల్ల ఐటి ఎగుమతులు గణనీయంగా పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రూ.20 వేల కోట్లతో దేశవ్యాప్తంగా ఉన్న రూ.2.50 లక్షల గ్రామపంచాయితీ పరిధిలో నేషనల్‌ ఆప్టికల్‌ ఫైబర్‌ నెట్‌వర్క్‌ ఏర్పాటు చేస్తామన్నారు. దీనివల్ల కమ్యూనికేషన్‌ వ్యవస్థలో లోపాలు లేకుండా స్పష్టత ఉంటుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సెల్‌ సిగల్‌ లేని మారుమూల ప్రాంతాల్లో రూ.300 కోట్లతో కొత్తగా సెల్‌ టవర్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అక్టోబరు నుండి రోమింగ్‌ లేకుండా దేశంలో ఎక్కడి నుంచైనా మాట్లాడటానికి వీలుగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. దేశంలో రూ.1.55 లక్షల పోస్టాఫీసులను రూ.4 వేల 500 కోట్లతో ఆధునీకరణకు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. వెయ్యి ఏటిఎంలు ఏర్పాటు చేస్తామన్నారు.

No comments: