MARQUEE

URGENT IMPORTANT APPEAL ACT ( Association for Computer Teachers ) అనే ఉద్యమం కంప్యూటర్ టీచర్లతో శ్రీకాకుళం లో నెమ్మదిగా ప్రారంభమయినది . 2011 జూలై 10వ తేదిన ఆవిర్భవించింది. సభ్యుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసింది. ఇతర సంఘాలతో భుజం కలిపి పోరాడింది. సమ్మెలకు ఉద్యమాలకు మారుపేరుగా నిలిచింది. కోర్దినేటర్ల వేధింపులకు ఏజెన్సీల మోసాలకు ఎదురు తిరిగింది. ఈ క్రమంలో అనేక మంది సభ్యులు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అన్ని జిల్లాలకు, రాష్ట్రమంతట ACT పేరు మారుమ్రోగింది. నిజాయితీకి నిర్భీతికి చిరునామాగా మారింది కనుకనే రాష్ట్ర స్థాయి సంఘంగా మారింది. చాలిచాలని జీతాలతో బ్రతుకులు ఈడుస్తున్న మన కంప్యూటర్ టీచర్ల దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పనిచేయ్య్లనేదే ACT ఉద్దేశ్యం. అందరి ఉపాధ్యాయుల వలె కంప్యూటర్ టీచర్లు గౌరవప్రదంగా జీవించాలనేదే ACT కర్తవ్యం. అందుకే ఏ రొజూ సభ్యుల నుంచి పైసాకుడా వసూలు చెయ్యలేదు. ఇకముందు కూడా వసూలు చెయ్యదు. వసులూ చేసే అధికారాన్ని ACT ఎవరికీ ఇవ్వలేదు. ACT పేరుతొ వస్తున్న ఈ మెయిల్స్ మరియు SMS లకు ఎవరు స్పందిచ వద్దని ఎవరికీ డబ్బులు చెల్లించవద్దని ACT STATE COMMITTEE కోరుతోంది ACT చందాలకు, వసూళ్ళకు, సభ్యత్వ రుసుములకు వ్యతిరేకం జై కంప్యూటర్ టీచర్ !!! జై జై ACT !!!

Monday, March 10, 2014

'ఉపాధి' కూలి రూ.250

- వ్యకాస డిమాండ్‌  - కరీంనగర్‌లో జీపు జాతా ప్రారంభం  - మెదక్‌లో కొనసాగింపు
ప్రజాశక్తి - కరీనంనగర్‌ టౌన్‌/మెదక్‌
'ఉపాధి' చట్టం కింద కూలీలకు 200 రోజులు పని కల్పించి రోజుకూలీ రూ.250 చెల్లించాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి బి.ప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. వ్యకాస, మేట్ల సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన కరీంనగర్‌ కోర్టు చౌరస్తాలో శుక్రవారం జీపు జాతాను ప్రసాద్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ పేదల జీవనానికి కొంత భరోసాగా ఉన్న ఉపాధి హామీ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. పేదలంతా పోరాడి సాధించుకున్న ఈ పథకాన్ని ప్రభుత్వం గ్రామీణ పెత్తందార్లకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ స్థితిలో చట్టాన్ని కాపాడుకోవడంతో పాటు పకడ్బందీగా అమలు చేయించుకోవాల్సిన బాధ్యతా తమపైనే ఉందన్న అవగాహన కూలీలకు కల్పిస్తామని చెప్పారు. అందులో భాగంగానే ఈ ప్రచార జాతా చేపడుతున్నట్లు ప్రసాద్‌ పేర్కొన్నారు. మొదటి రోజు కరీంనగర్‌ మండలంలోని 9 గ్రామాల్లో జీపుజాతా సాగింది. పని సమయంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.ఐదు లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. జాతాలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాతంగి శంకర్‌, భూతం సారంగపాణి, డివైఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి భీమాసాహెబ్‌, నాయకులు తిరుపతి పాల్గొన్నారు. తొలుత డాక్టర్‌ అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేపి నివాళులు అర్పించారు.
మెదక్‌ జిల్లాలో ఐదురోజులుగా కొనసాగుతున్న 'ఉపాధికూలీ గర్జన' యాత్ర శుక్రవారం సంగారెడ్డి మండలంలోని చిద్రుప్ప, ఉత్తరపల్లి, బేగంటపేట్‌, బేగంపేట్‌ తండా తదితర గ్రామాల్లో సాగింది. ఈ సందర్భంగా సంఘం మండల కార్యదర్శి పి.అశోక్‌ మాట్లాడుతూ.. ఉపాధి కూలి రూ.250కి పెంచాలని, బకాయిలు వెంటనే చెల్లించాలని, 200రోజులు పనిదినాలు కల్పించాలని కోరారు. యాత్రలో నాయకులు ఎన్‌.భాస్కర్‌, నర్సింలు, లావణ్య, ప్రభుకర్‌, గోపాల్‌, నవనీత, జ్యోతి, బాలయ్య, లక్ష్మయ్య పాల్గొన్నారు.

No comments: