MARQUEE

URGENT IMPORTANT APPEAL ACT ( Association for Computer Teachers ) అనే ఉద్యమం కంప్యూటర్ టీచర్లతో శ్రీకాకుళం లో నెమ్మదిగా ప్రారంభమయినది . 2011 జూలై 10వ తేదిన ఆవిర్భవించింది. సభ్యుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసింది. ఇతర సంఘాలతో భుజం కలిపి పోరాడింది. సమ్మెలకు ఉద్యమాలకు మారుపేరుగా నిలిచింది. కోర్దినేటర్ల వేధింపులకు ఏజెన్సీల మోసాలకు ఎదురు తిరిగింది. ఈ క్రమంలో అనేక మంది సభ్యులు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అన్ని జిల్లాలకు, రాష్ట్రమంతట ACT పేరు మారుమ్రోగింది. నిజాయితీకి నిర్భీతికి చిరునామాగా మారింది కనుకనే రాష్ట్ర స్థాయి సంఘంగా మారింది. చాలిచాలని జీతాలతో బ్రతుకులు ఈడుస్తున్న మన కంప్యూటర్ టీచర్ల దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పనిచేయ్య్లనేదే ACT ఉద్దేశ్యం. అందరి ఉపాధ్యాయుల వలె కంప్యూటర్ టీచర్లు గౌరవప్రదంగా జీవించాలనేదే ACT కర్తవ్యం. అందుకే ఏ రొజూ సభ్యుల నుంచి పైసాకుడా వసూలు చెయ్యలేదు. ఇకముందు కూడా వసూలు చెయ్యదు. వసులూ చేసే అధికారాన్ని ACT ఎవరికీ ఇవ్వలేదు. ACT పేరుతొ వస్తున్న ఈ మెయిల్స్ మరియు SMS లకు ఎవరు స్పందిచ వద్దని ఎవరికీ డబ్బులు చెల్లించవద్దని ACT STATE COMMITTEE కోరుతోంది ACT చందాలకు, వసూళ్ళకు, సభ్యత్వ రుసుములకు వ్యతిరేకం జై కంప్యూటర్ టీచర్ !!! జై జై ACT !!!

Sunday, March 30, 2014

ACT NEWS : టెన్త్‌ పరీక్షల తేదీల మార్పు

- షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు  - 10,11న జరగాల్సినవి 12, 15 తేదీల్లో నిర్వహణ  - ప్రభుత్వ పరీక్షల విభాగం ప్రకటన --

AP SSC 10th Class Hall Tickets Download 2014 --

ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో
పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలపై ఎన్నికల ప్రభావం పడింది. దీంతో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. వచ్చేనెల 10, 11 తేదీల్లో జరగాల్సిన టెన్త్‌ పరీక్షలను వచ్చేనెల 12, 15 తేదీల్లో నిర్వహించాలని ప్రభుత్వ పరీక్షల విభాగం నిర్ణయించింది. టెన్త్‌ పరీక్షల పాత షెడ్యూల్‌ ప్రకారం ఈనెల 27 నుంచి వచ్చేనెల 15వ తేదీ వరకు జరుగుతాయి. తాజా షెడ్యూల్‌ ప్రకారం ఈనెల 27 నుంచి వచ్చేనెల 17వ తేదీ వరకు పొడిగించారు. ఎంపిటిసి, జడ్పీటిసి ఎన్నికలు వచ్చేనెల 6, 11 తేదీల్లో పోలింగ్‌ జరపాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఎన్నికల పోలింగ్‌ ప్రభావం టెన్త్‌ పరీక్షలపై పడింది. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు బి మన్మథరెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. వచ్చేనెల 6న తొలిదశ పోలింగ్‌ ఉండడంతో 7వ తేదీన జరగాల్సిన జనరల్‌ సైన్స్‌ పేపర్‌-1 సమయంలో స్వల్ప మార్పులు చేశామని తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగాల్సిన పరీక్ష ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒకటిన్నర వరకు జరపాలని నిర్ణయించామని పేర్కొన్నారు. వచ్చేనెల 10న ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మధ్యాహ్నం 12 గంటల వరకు సోషల్‌ స్టడీస్‌ పేపర్‌-1 జరగాల్సి ఉంది. సోషల్‌ స్టడీస్‌ పేపర్‌-1ను వచ్చేనెల 12వ తేదీకి వాయిదా వేశామని తెలిపారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒకటిన్నర వరకు నిర్వహించనున్నామని పేర్కొన్నారు. వచ్చేనెల 11వ తేదీన జరగాల్సిన సోషల్‌ స్టడీస్‌ పేపర్‌-2 వచ్చేనెల 15 తేదీకి వాయిదా పడిందని తెలిపారు. వచ్చేనెల 12న జరగాల్సిన ఓఎస్‌ఎస్‌సి మెయిన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-2 వచ్చేనెల 16వ తేదీకి మార్చబడిందని పేర్కొన్నారు. వచ్చేనెల 15న జరిగే ఎస్‌ఎస్‌సి ఒకేషనల్‌ కోర్సు (థియరీ) పరీక్ష వచ్చేనెల 17వ తేదీన జరగనుందని తెలిపారు.
ఎస్‌ఎస్‌సి మారిన పరీక్షల టైంటేబుల్‌
పాత తేది మారిన తేది సబ్జెక్టు సమయం
10.04.14 గురువారం 12.04.14 శనివారం సోషల్‌ స్టడీస్‌ పేపర్‌-1 11 నుంచి 1.30 వరకు
11.04.14 శుక్రవారం 15.04.14 మంగళవారం సోషల్‌ స్టడీస్‌ పేపర్‌-2 9.30 నుంచి 12 వరకు
12.04.14 శనివారం 16.04.14 బుధవారం ఓఎస్‌ఎస్‌సి మెయిన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-2
(సంస్కృతం, అరబిక్‌, పర్షియన్‌) 9.30 నుంచి 12 వరకు
15.04.14 మంగళవారం 17.04.14 గురువారం ఒకేషనల్‌ కోర్సు (థియరీ) 9.30 నుంచి 11.30 వరకు

No comments: