MARQUEE

URGENT IMPORTANT APPEAL ACT ( Association for Computer Teachers ) అనే ఉద్యమం కంప్యూటర్ టీచర్లతో శ్రీకాకుళం లో నెమ్మదిగా ప్రారంభమయినది . 2011 జూలై 10వ తేదిన ఆవిర్భవించింది. సభ్యుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసింది. ఇతర సంఘాలతో భుజం కలిపి పోరాడింది. సమ్మెలకు ఉద్యమాలకు మారుపేరుగా నిలిచింది. కోర్దినేటర్ల వేధింపులకు ఏజెన్సీల మోసాలకు ఎదురు తిరిగింది. ఈ క్రమంలో అనేక మంది సభ్యులు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అన్ని జిల్లాలకు, రాష్ట్రమంతట ACT పేరు మారుమ్రోగింది. నిజాయితీకి నిర్భీతికి చిరునామాగా మారింది కనుకనే రాష్ట్ర స్థాయి సంఘంగా మారింది. చాలిచాలని జీతాలతో బ్రతుకులు ఈడుస్తున్న మన కంప్యూటర్ టీచర్ల దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పనిచేయ్య్లనేదే ACT ఉద్దేశ్యం. అందరి ఉపాధ్యాయుల వలె కంప్యూటర్ టీచర్లు గౌరవప్రదంగా జీవించాలనేదే ACT కర్తవ్యం. అందుకే ఏ రొజూ సభ్యుల నుంచి పైసాకుడా వసూలు చెయ్యలేదు. ఇకముందు కూడా వసూలు చెయ్యదు. వసులూ చేసే అధికారాన్ని ACT ఎవరికీ ఇవ్వలేదు. ACT పేరుతొ వస్తున్న ఈ మెయిల్స్ మరియు SMS లకు ఎవరు స్పందిచ వద్దని ఎవరికీ డబ్బులు చెల్లించవద్దని ACT STATE COMMITTEE కోరుతోంది ACT చందాలకు, వసూళ్ళకు, సభ్యత్వ రుసుములకు వ్యతిరేకం జై కంప్యూటర్ టీచర్ !!! జై జై ACT !!!

Saturday, January 25, 2014

కంప్యూటర్ విద్య.. ఒట్టి మిథ్య

Sakshi | Updated: January 14, 2014 02:38 (IST)
నవాబుపేట, న్యూస్‌లైన్: ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ విద్య మిథ్యగా మారింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నామని గొప్పలు చెప్పుకుంటున్నా వాస్తవంలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ప్రభుత్వం గ్రామీణ విద్యార్థులకు కంప్యూటర్ విద్యను అందించడానికి సన్నాహాలు చేసింది. లక్షల విలువ చేసే కంప్యూటర్లను కొనుగోలు చే సి పాఠశాలలకు పంపింది. కానీ వాటి నిర్వహణ బాధ్యతలను పక్కన పెట్టడంతో విద్యార్థులకు కంప్యూటర్ విద్య అందని ద్రాక్షలా మారుతోంది. ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది. ఆరేళ్ల క్రితం ఏర్పాటైన కంప్యూటర్లకు సరైన శిక్షకులు లేక విలువైన కంప్యూటర్లు మూలన పడ్డాయి.
కొన్ని పాఠశాలలకే పంపిణీ...
గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం మొదటి దశలో కొన్ని పాఠశాలలను ఎంపిక చేసి కంప్యూటర్లను అందించింది. మిగిలిన పాఠశాలలకు కంప్యూటర్లు కేటాయించాలని ఆయా మండలాల ఎంఈవోలు ప్రతిపాదనలు పంపారు. ఇప్పటి వరకు మంజూరు చేయలేదు. మండలంలో 11 జిల్లా పరిషత్ పాఠశాలలు ఉన్నాయి. నారెగూడ, అక్నాపూర్, మీనపల్లికలాన్, అక్నాపూర్ పాఠశాలలకు కంప్యూటర్లు ఇప్పటికీ ఇవ్వలేదు. మిగిలిన వాటిలో ఒక్కో పాఠశాలకు 11 చొప్పున ఇచ్చారు.
ఉన్నచోట నిరుపయోగంగా...
ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్లతో పాటు వాటి నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు అప్పగించింది. దీంతో వారు ఇన్‌స్ట్రక్టర్లను నియమించి విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. ఏడాది పాటు బాగానే సాగినా నిర్వహణ సంస్థలు ఇన్‌స్ట్రక్టర్లకు గౌరవ వేతనాలు అందించకపోవడంతో వారు పాఠశాలలకు రావడం మానేశారు. దీంతో కంప్యూటర్లు నిరుపయోగంగా మారి పాడవుతున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి అన్ని పాఠశాలలకు కంప్యూటర్లు అందించాలని, విద్యార్థులకు కంప్యూటర్ విద్యను సరిగా అందించాలని పలువురు కోరుతున్నారు.

No comments: