MARQUEE

URGENT IMPORTANT APPEAL ACT ( Association for Computer Teachers ) అనే ఉద్యమం కంప్యూటర్ టీచర్లతో శ్రీకాకుళం లో నెమ్మదిగా ప్రారంభమయినది . 2011 జూలై 10వ తేదిన ఆవిర్భవించింది. సభ్యుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసింది. ఇతర సంఘాలతో భుజం కలిపి పోరాడింది. సమ్మెలకు ఉద్యమాలకు మారుపేరుగా నిలిచింది. కోర్దినేటర్ల వేధింపులకు ఏజెన్సీల మోసాలకు ఎదురు తిరిగింది. ఈ క్రమంలో అనేక మంది సభ్యులు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అన్ని జిల్లాలకు, రాష్ట్రమంతట ACT పేరు మారుమ్రోగింది. నిజాయితీకి నిర్భీతికి చిరునామాగా మారింది కనుకనే రాష్ట్ర స్థాయి సంఘంగా మారింది. చాలిచాలని జీతాలతో బ్రతుకులు ఈడుస్తున్న మన కంప్యూటర్ టీచర్ల దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పనిచేయ్య్లనేదే ACT ఉద్దేశ్యం. అందరి ఉపాధ్యాయుల వలె కంప్యూటర్ టీచర్లు గౌరవప్రదంగా జీవించాలనేదే ACT కర్తవ్యం. అందుకే ఏ రొజూ సభ్యుల నుంచి పైసాకుడా వసూలు చెయ్యలేదు. ఇకముందు కూడా వసూలు చెయ్యదు. వసులూ చేసే అధికారాన్ని ACT ఎవరికీ ఇవ్వలేదు. ACT పేరుతొ వస్తున్న ఈ మెయిల్స్ మరియు SMS లకు ఎవరు స్పందిచ వద్దని ఎవరికీ డబ్బులు చెల్లించవద్దని ACT STATE COMMITTEE కోరుతోంది ACT చందాలకు, వసూళ్ళకు, సభ్యత్వ రుసుములకు వ్యతిరేకం జై కంప్యూటర్ టీచర్ !!! జై జై ACT !!!

Tuesday, January 21, 2014

3 నుండి మున్సిపాలిటీ ఉద్యోగుల సమ్మె

Posted on: Mon 20 Jan 18:11:07.05133 2014
హైదరాబాద్ : ఫిబ్రవరి 3వ తేదీనుంచి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేయనున్నట్లు మున్సిపాలిటీ ఉద్యోగులు, ఐక్య కార్మిక సంఘాలు స్పష్టం చేశాయి. ఈమేరకు రాష్ట్రంలోని మున్సిపాలిటీ ఉద్యోగులు, కార్మికులు ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ సమస్యలను సామరస్యంగా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేదంటే జరగబోయే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. రాష్ట్రంలోని ఏడు కార్మిక సంఘాల ప్రతినిధులు హైదరాబాద్-మాసబ్ ట్యాంక్ లోని మున్సిపల్ పరిపాలనాశాఖ అధికారులకు సమ్మె నోటీసును అందజేశారు. గతంలో చేసిన సమ్మె సమయంలో కుదిరిన ఒప్పందాలను వెంటనే అమలుచేయాలని డిమాండ్ చేశారు.


  • No comments: