MARQUEE

URGENT IMPORTANT APPEAL ACT ( Association for Computer Teachers ) అనే ఉద్యమం కంప్యూటర్ టీచర్లతో శ్రీకాకుళం లో నెమ్మదిగా ప్రారంభమయినది . 2011 జూలై 10వ తేదిన ఆవిర్భవించింది. సభ్యుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసింది. ఇతర సంఘాలతో భుజం కలిపి పోరాడింది. సమ్మెలకు ఉద్యమాలకు మారుపేరుగా నిలిచింది. కోర్దినేటర్ల వేధింపులకు ఏజెన్సీల మోసాలకు ఎదురు తిరిగింది. ఈ క్రమంలో అనేక మంది సభ్యులు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అన్ని జిల్లాలకు, రాష్ట్రమంతట ACT పేరు మారుమ్రోగింది. నిజాయితీకి నిర్భీతికి చిరునామాగా మారింది కనుకనే రాష్ట్ర స్థాయి సంఘంగా మారింది. చాలిచాలని జీతాలతో బ్రతుకులు ఈడుస్తున్న మన కంప్యూటర్ టీచర్ల దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పనిచేయ్య్లనేదే ACT ఉద్దేశ్యం. అందరి ఉపాధ్యాయుల వలె కంప్యూటర్ టీచర్లు గౌరవప్రదంగా జీవించాలనేదే ACT కర్తవ్యం. అందుకే ఏ రొజూ సభ్యుల నుంచి పైసాకుడా వసూలు చెయ్యలేదు. ఇకముందు కూడా వసూలు చెయ్యదు. వసులూ చేసే అధికారాన్ని ACT ఎవరికీ ఇవ్వలేదు. ACT పేరుతొ వస్తున్న ఈ మెయిల్స్ మరియు SMS లకు ఎవరు స్పందిచ వద్దని ఎవరికీ డబ్బులు చెల్లించవద్దని ACT STATE COMMITTEE కోరుతోంది ACT చందాలకు, వసూళ్ళకు, సభ్యత్వ రుసుములకు వ్యతిరేకం జై కంప్యూటర్ టీచర్ !!! జై జై ACT !!!

Wednesday, December 18, 2013

పిల్లల్లో పఠనాసక్తిని పెంచడం అవశ్యం

Posted on: Wed 18 Dec 00:04:41.758765 2013

జీవితాన్ని సమగ్రంగా దర్శింపజేసే సాధనాలు పుస్త కాలని ఒక మహాను భావుడు చెప్పియున్నారు. అయితే మన సమాజంలో రాను రాను పుస్తక పఠనా భిరుచి తగ్గుతూ ఉండటం ఆందోళన కల్గించే అంశం. దేశ వ్యాప్తంగా దృశ్య మాధ్యమ ప్రభావం పెరగడం వల్ల దిన, వార, మాస పత్రికలకు ఆదరణ తగ్గుతోంది. ఈ ధోరణిని నిలువరించడానికి ప్రభుత్వం, గ్రంథాలయ సంస్థలు అడపాదడపా పుస్తక వారోత్సవాలు, గ్రంథాలయ వారోత్సవాలు వంటివి నిర్వహిస్తున్నా పెద్దగా ఫలితం కనిపించడం లేదు. కనుక తల్లిదండ్రులు తమ పిల్లలకు, ఉపాధ్యాయులు విద్యార్థులకు చిన్నప్పటి నుంచే పత్రికా పఠనం అలవాటు చేయాలి. వారికి పిల్లల మాస పత్రికలు, విజ్ఞానదాయక పుస్తకాలు, జీవిత చరిత్రలు వంటి సాహిత్యాన్ని అందుబాటులో ఉంచాలి. తీరిక సమయాల్లో బొమ్మలు గీయడం, వాటికి రంగులు వేయడం నేర్పించాలి. దినపత్రికల్లో బాలల పేజీని చదివిస్తూ పజిల్స్‌ పూరింపజేస్తూ ఆ పేజీలను సేకరించి అన్నింటినీ ఒక సంపుటిగా బైండింగ్‌గా చేయించవచ్చు. ఇట్లాంటి సంపుటాలను పిల్లల పుట్టినరోజు బహుమతిగా ఇస్తే వారెంతో సంతోషిస్తారు. కనుక పిల్లలను టీవీకి దూరంగా ఉంచి వారి స్థాయిలో పుస్తక పఠనం అభ్యాసం చేయించడం పెద్ద కష్టమేమీ కాదు. పత్రికలను అందుబాటులో ఉంచితే పిల్లలకు కొంత కాలానికైనా వాటిపై ఆసక్తి కలుగుతుంది. ఇది సహజం. దీని కోసం తల్లిదండ్రులు పెద్దగా కష్టపడనక్కర లేదు. అయితే ప్రతి ఇంట్లో ఉన్న మీడియా ప్రభావానికి పిల్లలను దూరంగా ఉంచాలి. అలాగే సెల్‌ఫోన్‌ కూడా పిల్లల విలువైన సమయాన్ని హరించివేస్తోంది. అవసరం లేనప్పుడు పిల్లలు మొబైల్‌ ఫోన్‌ను చేతిలోకి తీసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్నప్పుడు అలవడకపోతే పుస్తక పఠనం పెద్దయ్యాక అలవడదు. కనుక విద్యార్థి దశలోనే వారితో మంచి పుస్తకాలు చదివించాలి. పుస్తక పఠనం వల్ల పిల్లల్లో దేశభక్తి, ఆత్మవిశ్వాసం పెరగడం, కొత్త విషయాలు తెలుసుకోవడం, సృజనాత్మకత వంటి సామర్థ్యాలు అలవడతాయి. మానసిక వికాసం కలుగుతుంది. కనుక పఠనాసక్తిని పెంచడానికి సమాజంలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. బుక్‌ ఫెస్టివల్స్‌లో తక్కువ ధరలకే అపురూప పుస్తకాలను విక్రయించాలి. ప్రభుత్వం గ్రంథాలయాలను పట్టించుకొని అన్ని దిన, వార, మాస పత్రికలను అందుబాటులో ఉంచాలి. బాల సాహిత్యం, కథల పుస్తకాలు, నవలలు, విజ్ఞాన సర్వస్వం, పరిశోధనా గ్రంథాలు, క్రీడా పరిజ్ఞానం, తదితర పుస్తకాలు చదివించే ఏర్పాట్లు చేయాలి. 'పుస్తకం మంచి నేస్తం' అన్న భావనను విద్యావంతులందరిలో వ్యాపింపజేయాలి.
జి అశోక్‌, గోదూర్‌, కరీంనగర్‌జిల్లా

No comments: