MARQUEE

URGENT IMPORTANT APPEAL ACT ( Association for Computer Teachers ) అనే ఉద్యమం కంప్యూటర్ టీచర్లతో శ్రీకాకుళం లో నెమ్మదిగా ప్రారంభమయినది . 2011 జూలై 10వ తేదిన ఆవిర్భవించింది. సభ్యుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసింది. ఇతర సంఘాలతో భుజం కలిపి పోరాడింది. సమ్మెలకు ఉద్యమాలకు మారుపేరుగా నిలిచింది. కోర్దినేటర్ల వేధింపులకు ఏజెన్సీల మోసాలకు ఎదురు తిరిగింది. ఈ క్రమంలో అనేక మంది సభ్యులు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అన్ని జిల్లాలకు, రాష్ట్రమంతట ACT పేరు మారుమ్రోగింది. నిజాయితీకి నిర్భీతికి చిరునామాగా మారింది కనుకనే రాష్ట్ర స్థాయి సంఘంగా మారింది. చాలిచాలని జీతాలతో బ్రతుకులు ఈడుస్తున్న మన కంప్యూటర్ టీచర్ల దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పనిచేయ్య్లనేదే ACT ఉద్దేశ్యం. అందరి ఉపాధ్యాయుల వలె కంప్యూటర్ టీచర్లు గౌరవప్రదంగా జీవించాలనేదే ACT కర్తవ్యం. అందుకే ఏ రొజూ సభ్యుల నుంచి పైసాకుడా వసూలు చెయ్యలేదు. ఇకముందు కూడా వసూలు చెయ్యదు. వసులూ చేసే అధికారాన్ని ACT ఎవరికీ ఇవ్వలేదు. ACT పేరుతొ వస్తున్న ఈ మెయిల్స్ మరియు SMS లకు ఎవరు స్పందిచ వద్దని ఎవరికీ డబ్బులు చెల్లించవద్దని ACT STATE COMMITTEE కోరుతోంది ACT చందాలకు, వసూళ్ళకు, సభ్యత్వ రుసుములకు వ్యతిరేకం జై కంప్యూటర్ టీచర్ !!! జై జై ACT !!!

Sunday, July 7, 2013

మున్సిపల్‌ కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్‌ చేయాలి

మున్సిపల్‌ కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్‌ చేయాలి

ప్రజాశక్తి - కరీంనగర్‌ టౌన్‌   Thu, 4 Jul 2013, IST 
సిఐటియుజిల్లా కార్యదర్శి సంపత్‌
కనీసవేతనం రూ. 15వేలు, ఎనిమిది గంటల పనిదినాలు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 5 తరువాత ఎప్పుడైనా సమ్మెకు సిద్దమని సిఐటియు జిల్లా కార్యదర్శి ఎస్‌ సంపత్‌ అన్నారు. 108 సర్వీసెస్‌ కాంట్రాక్టు ఎంప్లాయూస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట గురువారం రిలే దీక్షలు ప్రాంరంభమయ్యాయి. ఈ దీక్షలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. సిబ్బందిని జివికె సంస్థ వేధింపులకు గురి చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎక్కడ ప్రమాదం జరిగినా వెంటనే స్పందించే 108 ఉద్యోగులకు కనీస వేతనాలు చెల్లించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించాలని ఆరు నెలలుగా సంస్థకు, ప్రభుత్వానికి పలు మార్లు విన్నవించినా స్పందన కరువైందని పేర్కొన్నారు. సిబ్బంది న్యాయమైన ఆందోళనకు ప్రజలు స్పందించాలని కోరారు. రిలే దీక్షలకు స్పందించకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ దీక్షలో సంఘం జిల్లా అధ్యక్షులు సిహెచ్‌ రాజు, ఉపాధ్యక్షులు ఎ రాజేందర్‌, సహాయక కార్యదర్శి టి రాజేందర్‌, కమిటీ సభ్యులు టి ఎల్లాగౌడ్‌, సదాచారి, గోపికృష్ణ, రవి, సంపత్‌, రాంభూపాల్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.

No comments: