MARQUEE

URGENT IMPORTANT APPEAL ACT ( Association for Computer Teachers ) అనే ఉద్యమం కంప్యూటర్ టీచర్లతో శ్రీకాకుళం లో నెమ్మదిగా ప్రారంభమయినది . 2011 జూలై 10వ తేదిన ఆవిర్భవించింది. సభ్యుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసింది. ఇతర సంఘాలతో భుజం కలిపి పోరాడింది. సమ్మెలకు ఉద్యమాలకు మారుపేరుగా నిలిచింది. కోర్దినేటర్ల వేధింపులకు ఏజెన్సీల మోసాలకు ఎదురు తిరిగింది. ఈ క్రమంలో అనేక మంది సభ్యులు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అన్ని జిల్లాలకు, రాష్ట్రమంతట ACT పేరు మారుమ్రోగింది. నిజాయితీకి నిర్భీతికి చిరునామాగా మారింది కనుకనే రాష్ట్ర స్థాయి సంఘంగా మారింది. చాలిచాలని జీతాలతో బ్రతుకులు ఈడుస్తున్న మన కంప్యూటర్ టీచర్ల దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పనిచేయ్య్లనేదే ACT ఉద్దేశ్యం. అందరి ఉపాధ్యాయుల వలె కంప్యూటర్ టీచర్లు గౌరవప్రదంగా జీవించాలనేదే ACT కర్తవ్యం. అందుకే ఏ రొజూ సభ్యుల నుంచి పైసాకుడా వసూలు చెయ్యలేదు. ఇకముందు కూడా వసూలు చెయ్యదు. వసులూ చేసే అధికారాన్ని ACT ఎవరికీ ఇవ్వలేదు. ACT పేరుతొ వస్తున్న ఈ మెయిల్స్ మరియు SMS లకు ఎవరు స్పందిచ వద్దని ఎవరికీ డబ్బులు చెల్లించవద్దని ACT STATE COMMITTEE కోరుతోంది ACT చందాలకు, వసూళ్ళకు, సభ్యత్వ రుసుములకు వ్యతిరేకం జై కంప్యూటర్ టీచర్ !!! జై జై ACT !!!

Wednesday, February 13, 2013

13-2-13

కనీస వేతనాల సాధనకు చలో ఢిల్లీ : సిఐటియు Chitturu News clip

ఆదివారం స్థానిక సిటిటియు కార్యాలయంలో విలేక రుల సమావేశం 
నిర్వహించారు.ఈసందర్భంగా ఆయన మాట్లా డుతూ కేంద్ర ప్రభుత్వ నిధులతో మన రాష్ట్రంలో ఐసిడిఎస్‌ మధ్యాహ్నం భోజన పథకం నేషనల్‌ రూరల్‌ హెల్త్‌ మిషన్‌, సర్వశిక్ష అభియాన్‌, (రాజీవ్‌ విద్యామిషన్‌) యం.జి.యన్‌.ఆర్‌.ఈ.జి.యస్‌(ఉపాదిహామి) జాతీయ గ్రామీణ ఉపాధి జీవనోపాదుల మిషన్‌ (ఇందిరా కాంతి పథం) ఐసిటి(కంప్యూటర్‌విద్యా) మినీ గురుకులాలు పట్టణ పేదరిక నిర్మూలన పథకం జాతీయ గ్రామీణ మంచి నీటి పథకం అమలవుతున్నాయని తెలిపారు. ఈ పథకాలలో ఆరు లక్షల మంది ఉన్నారన్నారు. రెగ్యులర్‌ ప్రాతిపదికన ఉద్యోగులను నియమిం చకుండా గౌరవవేతనం, పారితోషికం, కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌, పార్ట్‌టైమ్‌ ప్రాతిపదికన నియమించి అతి తక్కువ వేతనాలనతో వెట్టి చేయించుకుంటున్నారని విమర్శించారు చట్ట ప్రకారం చెల్లించాల్సిన పియఫ్‌, ఇయస్‌ఐ సౌకర్యలు అందడం లేదన్నారు. అవినీతి స్కామ్‌లో మునిగిన ప్రభుత్వం కార్మికుల సంక్షేమాన్ని గాలికి వదిలేసిందన్నారు. ఉద్యోగుల కనీస వేతనాల పరిష్కార కోసం నవంబర్‌ 26, 27 తేదీలలో చలో డిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.

No comments: