MARQUEE

URGENT IMPORTANT APPEAL ACT ( Association for Computer Teachers ) అనే ఉద్యమం కంప్యూటర్ టీచర్లతో శ్రీకాకుళం లో నెమ్మదిగా ప్రారంభమయినది . 2011 జూలై 10వ తేదిన ఆవిర్భవించింది. సభ్యుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసింది. ఇతర సంఘాలతో భుజం కలిపి పోరాడింది. సమ్మెలకు ఉద్యమాలకు మారుపేరుగా నిలిచింది. కోర్దినేటర్ల వేధింపులకు ఏజెన్సీల మోసాలకు ఎదురు తిరిగింది. ఈ క్రమంలో అనేక మంది సభ్యులు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అన్ని జిల్లాలకు, రాష్ట్రమంతట ACT పేరు మారుమ్రోగింది. నిజాయితీకి నిర్భీతికి చిరునామాగా మారింది కనుకనే రాష్ట్ర స్థాయి సంఘంగా మారింది. చాలిచాలని జీతాలతో బ్రతుకులు ఈడుస్తున్న మన కంప్యూటర్ టీచర్ల దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పనిచేయ్య్లనేదే ACT ఉద్దేశ్యం. అందరి ఉపాధ్యాయుల వలె కంప్యూటర్ టీచర్లు గౌరవప్రదంగా జీవించాలనేదే ACT కర్తవ్యం. అందుకే ఏ రొజూ సభ్యుల నుంచి పైసాకుడా వసూలు చెయ్యలేదు. ఇకముందు కూడా వసూలు చెయ్యదు. వసులూ చేసే అధికారాన్ని ACT ఎవరికీ ఇవ్వలేదు. ACT పేరుతొ వస్తున్న ఈ మెయిల్స్ మరియు SMS లకు ఎవరు స్పందిచ వద్దని ఎవరికీ డబ్బులు చెల్లించవద్దని ACT STATE COMMITTEE కోరుతోంది ACT చందాలకు, వసూళ్ళకు, సభ్యత్వ రుసుములకు వ్యతిరేకం జై కంప్యూటర్ టీచర్ !!! జై జై ACT !!!

Tuesday, February 25, 2014

చర్చలు విఫలం..సమ్మె కొనసాగుతుంది - అంగన్ వాడీలు Posted on: Mon 24 Feb 18:13:05.21079 2014





హైదరాబాద్ : అంగన్ వాడీ ప్రతినిధులతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి జరిపిన చర్చలు విఫలం అయ్యాయి. తాము చేస్తున్న సమ్మె కొనసాగుతుందని అంగన్ వాడీ ప్రకటించింది. సోమవారం అంగన్ వాడీ చేసిన పోరాటానికి ప్రభుత్వం తలొగ్గింది. చర్చలకు రావాలని సీఎస్ సాయంత్రం ఆహ్వానించారు. అంగన్ వాడీ వర్కర్ల, హెల్పర్ల యూనియన్ ప్రధాన కార్యదర్శి పి.రోజా, మరికొందరు సిఐటియు నేతలు సచివాలయానికి వెళ్లారు. సమస్యల పరిష్కారం పై ఈనెల 26వ తేదీన మరోమారు చర్చలకు రావాలని అంగన్ వాడీ కార్యకర్తలకు సీఎస్ సూచించారు. భేటీ అనంతరం అంగన్ వాడీ ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. మా సమస్యలను సీఎస్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని, దీనిపై 26వ తేదీన చర్చలకు రావాలని సీఎస్ సూచించడం జరిగిందని తెలిపారు. ఇందిరాపార్కు వద్దనున్న ప్రతినిధులతో చర్చించిన తరువాత తమ భవిష్యత్ కార్యచరణను ప్రకటిస్తామని అంగన్ వాడీ ప్రతినిధులు తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధానాలతో కూడిన ఒక నివేదిక ఇవ్వడం జరిగిందని, 26వ తేదీన చర్చలకు వస్తామని అప్పుడు ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే కృతజ్ఞతలు తెలియచేస్తామని లేకుంటే సమ్మెను ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు.

No comments: