MARQUEE

URGENT IMPORTANT APPEAL ACT ( Association for Computer Teachers ) అనే ఉద్యమం కంప్యూటర్ టీచర్లతో శ్రీకాకుళం లో నెమ్మదిగా ప్రారంభమయినది . 2011 జూలై 10వ తేదిన ఆవిర్భవించింది. సభ్యుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసింది. ఇతర సంఘాలతో భుజం కలిపి పోరాడింది. సమ్మెలకు ఉద్యమాలకు మారుపేరుగా నిలిచింది. కోర్దినేటర్ల వేధింపులకు ఏజెన్సీల మోసాలకు ఎదురు తిరిగింది. ఈ క్రమంలో అనేక మంది సభ్యులు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అన్ని జిల్లాలకు, రాష్ట్రమంతట ACT పేరు మారుమ్రోగింది. నిజాయితీకి నిర్భీతికి చిరునామాగా మారింది కనుకనే రాష్ట్ర స్థాయి సంఘంగా మారింది. చాలిచాలని జీతాలతో బ్రతుకులు ఈడుస్తున్న మన కంప్యూటర్ టీచర్ల దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పనిచేయ్య్లనేదే ACT ఉద్దేశ్యం. అందరి ఉపాధ్యాయుల వలె కంప్యూటర్ టీచర్లు గౌరవప్రదంగా జీవించాలనేదే ACT కర్తవ్యం. అందుకే ఏ రొజూ సభ్యుల నుంచి పైసాకుడా వసూలు చెయ్యలేదు. ఇకముందు కూడా వసూలు చెయ్యదు. వసులూ చేసే అధికారాన్ని ACT ఎవరికీ ఇవ్వలేదు. ACT పేరుతొ వస్తున్న ఈ మెయిల్స్ మరియు SMS లకు ఎవరు స్పందిచ వద్దని ఎవరికీ డబ్బులు చెల్లించవద్దని ACT STATE COMMITTEE కోరుతోంది ACT చందాలకు, వసూళ్ళకు, సభ్యత్వ రుసుములకు వ్యతిరేకం జై కంప్యూటర్ టీచర్ !!! జై జై ACT !!!

Wednesday, November 30, 2016

కంఫ్యూటర్ శిక్షణ పునరుద్ధరించండి...

మోపిదేవి: ప్రభూత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టిన కంప్యూటర్ విద్యావిధానం కొనసాగించాలని పీ.ఆర్టీ.యూ. రాష్ట్ర అధ్యక్షుడు మత్తి కమలాకరరావు  ప్రభూత్వాన్ని డిమాండ్ చేశారు. మోఫిదేవిలో ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గతంలో ప్రభూత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన కంఫ్యూటర్ విధ్యను వదిలివేయడం వల్ల కొంతకాలం చెప్పిన బోధన వృథా అవుతుందని అందువల్ల గతంలో పనిచేసిన కంప్యూటర్  శిక్షకులను విడుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు... 
కంప్యూటర్ బోధకులని నియమించాలి యాక్ట్ కృష్ణ జిల్లా అధ్యక్షుడు ఎస్.కె.ఎమ్ సుభాని మరియు భట్టు ప్రభూత్వాన్ని డిమాండ్ చేశారు.
పూర్తి వివరాలకై : ఎస్.కె.ఎమ్ సుభాని, కృష్ణ జిల్లా, ఆంద్రప్రదేశ్. 

No comments: