MARQUEE

URGENT IMPORTANT APPEAL ACT ( Association for Computer Teachers ) అనే ఉద్యమం కంప్యూటర్ టీచర్లతో శ్రీకాకుళం లో నెమ్మదిగా ప్రారంభమయినది . 2011 జూలై 10వ తేదిన ఆవిర్భవించింది. సభ్యుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసింది. ఇతర సంఘాలతో భుజం కలిపి పోరాడింది. సమ్మెలకు ఉద్యమాలకు మారుపేరుగా నిలిచింది. కోర్దినేటర్ల వేధింపులకు ఏజెన్సీల మోసాలకు ఎదురు తిరిగింది. ఈ క్రమంలో అనేక మంది సభ్యులు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అన్ని జిల్లాలకు, రాష్ట్రమంతట ACT పేరు మారుమ్రోగింది. నిజాయితీకి నిర్భీతికి చిరునామాగా మారింది కనుకనే రాష్ట్ర స్థాయి సంఘంగా మారింది. చాలిచాలని జీతాలతో బ్రతుకులు ఈడుస్తున్న మన కంప్యూటర్ టీచర్ల దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పనిచేయ్య్లనేదే ACT ఉద్దేశ్యం. అందరి ఉపాధ్యాయుల వలె కంప్యూటర్ టీచర్లు గౌరవప్రదంగా జీవించాలనేదే ACT కర్తవ్యం. అందుకే ఏ రొజూ సభ్యుల నుంచి పైసాకుడా వసూలు చెయ్యలేదు. ఇకముందు కూడా వసూలు చెయ్యదు. వసులూ చేసే అధికారాన్ని ACT ఎవరికీ ఇవ్వలేదు. ACT పేరుతొ వస్తున్న ఈ మెయిల్స్ మరియు SMS లకు ఎవరు స్పందిచ వద్దని ఎవరికీ డబ్బులు చెల్లించవద్దని ACT STATE COMMITTEE కోరుతోంది ACT చందాలకు, వసూళ్ళకు, సభ్యత్వ రుసుములకు వ్యతిరేకం జై కంప్యూటర్ టీచర్ !!! జై జై ACT !!!

Saturday, May 3, 2014

సమస్యలు పరిష్కరించకుంటే మలిదశ పోరాటాలు

-  అంగన్‌వాడీ యూనియన్‌ కార్యదర్శి జయలకిë ప్రజాశక్తి-నిజామాబాద్‌సిటీ
          సమస్యలు పరిష్కరించాలని అంగన్‌వాడీ ఉద్యోగులు గతంలో రాష్ట్రవ్యాప్తంగా 13రోజులు సమ్మె చేశారని, రాబోయే ప్రభుత్వాలు సమస్యలు పరిష్కరించకుంటే మలిదశ పోరాటాలకూ సిద్ధమేనని అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌(సిఐటియు) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జయలక్ష్మి అన్నారు. నిజామాబాద్‌ నగరంలోని సిఐటియు జిల్లా కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన జిల్లా సదస్సులో ఆమె మాట్లాడారు. అంగన్‌వాడీ ఉద్యోగుల సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో సమ్మె నిర్వహించాల్సి వచ్చిందన్నారు. అటు ప్రభుత్వం, ఇటు అధికారులు హామీనిచ్చి మాట తప్పుతున్నారన్నారు. యూనియన్‌ను బలహీన పర్చటానికి పూనుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రోజు రోజుకూ పని భారం పెంచి అంగన్‌వాడీ ఉద్యోగులతో వెట్టిచాకిరీ చేయించుకుంటున్నారని అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో కార్మిక వ్యతిరేకులను ఓడించాలని పిలుపునిచ్చారు. అనంతరం సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్‌బాబు మాట్లాడుతూ.. శ్రమదోపిడీకి పాల్పడే వాళ్లని శిక్షించాలని చెబుతున్న ప్రభుత్వం ఉద్యోగులను శ్రమదోపిడికీ చేస్తోందని విమర్శించారు. అనంతరం జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. కార్యక్రమంలో యూనియన్‌ జిల్లా నాయకులు భారతి, ఝాన్సి, యామ్మ, దుర్గా, రాజసులోచన పాల్గొన్నారు.


No comments: