MARQUEE

URGENT IMPORTANT APPEAL ACT ( Association for Computer Teachers ) అనే ఉద్యమం కంప్యూటర్ టీచర్లతో శ్రీకాకుళం లో నెమ్మదిగా ప్రారంభమయినది . 2011 జూలై 10వ తేదిన ఆవిర్భవించింది. సభ్యుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసింది. ఇతర సంఘాలతో భుజం కలిపి పోరాడింది. సమ్మెలకు ఉద్యమాలకు మారుపేరుగా నిలిచింది. కోర్దినేటర్ల వేధింపులకు ఏజెన్సీల మోసాలకు ఎదురు తిరిగింది. ఈ క్రమంలో అనేక మంది సభ్యులు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అన్ని జిల్లాలకు, రాష్ట్రమంతట ACT పేరు మారుమ్రోగింది. నిజాయితీకి నిర్భీతికి చిరునామాగా మారింది కనుకనే రాష్ట్ర స్థాయి సంఘంగా మారింది. చాలిచాలని జీతాలతో బ్రతుకులు ఈడుస్తున్న మన కంప్యూటర్ టీచర్ల దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పనిచేయ్య్లనేదే ACT ఉద్దేశ్యం. అందరి ఉపాధ్యాయుల వలె కంప్యూటర్ టీచర్లు గౌరవప్రదంగా జీవించాలనేదే ACT కర్తవ్యం. అందుకే ఏ రొజూ సభ్యుల నుంచి పైసాకుడా వసూలు చెయ్యలేదు. ఇకముందు కూడా వసూలు చెయ్యదు. వసులూ చేసే అధికారాన్ని ACT ఎవరికీ ఇవ్వలేదు. ACT పేరుతొ వస్తున్న ఈ మెయిల్స్ మరియు SMS లకు ఎవరు స్పందిచ వద్దని ఎవరికీ డబ్బులు చెల్లించవద్దని ACT STATE COMMITTEE కోరుతోంది ACT చందాలకు, వసూళ్ళకు, సభ్యత్వ రుసుములకు వ్యతిరేకం జై కంప్యూటర్ టీచర్ !!! జై జై ACT !!!

Tuesday, June 24, 2014

కంప్యూటర్‌ టీచర్లను కొనసాగించండి...

Posted on: Tue 24 Jun 04:35:26.844159 2014
- విద్యామంత్రికి టిసిటిఎస్‌ వినతి
ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో

                    ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసిన కంప్యూటర్‌ టీచర్లను కొనసాగించాలని, తొలగించిన వారిని విధుల్లోకి తీసుకోవాలని తెలంగాణ కంప్యూటర్‌ టీచర్ల సంఘం (టిసిటిఎస్‌) డిమాండ్‌ చేసింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి జి జగదీష్‌రెడ్డిని టిసిటిఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె సతీష్‌కుమార్‌, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జె ఆనంద్‌కుమార్‌, డి కృష్ణయ్య సోమవారం సచివాలయంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో 2,300 ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్‌ విద్యను అందిస్తున్నారని తెలిపారు. 2013 అక్టోబర్‌తో ఈ పథకం ముగిసిందని పేర్కొన్నారు. దీంతో 2,300 పాఠశాలల్లో 4,600 మంది కంప్యూటర్‌ టీచర్లు రోడ్డున పడ్డారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకంతో కాకుండా రాష్ట్ర ప్రభుత్వమే కంప్యూటర్‌ విద్యను అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టాలని సూచించారు. అదనపు నిధులు కేటాయించి పనిచేసిన టీచర్లను కొనసాగించాలని కోరారు. ఈ పథకం నిలుపుదల చేయడం వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 12 లక్షల మంది పేద విద్యార్థులకు కంప్యూటర్‌ విద్య దూరమవుతోందని తెలిపారు. ఆర్‌ఎంఎస్‌ఎ ద్వారా రాష్ట్రంలోని 2,300 పాఠశాలల్లో కంప్యూటర్‌ విద్యను కొనసాగించి, కంప్యూటర్‌ టీచర్లను కొనసాగించాలని కోరారు. 

జూలై నెలాఖరుకల్లా అవకాశం కల్పిస్తాం : విద్యామంత్రి 

                దీనిపై స్పందించిన విద్యామంత్రి జగదీష్‌రెడ్డి జూలై నెలాఖరుకల్లా మొదట సీనియర్స్‌కు అవకాశం కల్పిస్తామని చెప్పినట్లు తెలిపారు. ఆ తర్వాతే కొత్త వారికి సంబంధించిన అంశాన్ని పరిశీలిస్తామన్నారని పేర్కొన్నారు.


No comments: