MARQUEE

URGENT IMPORTANT APPEAL ACT ( Association for Computer Teachers ) అనే ఉద్యమం కంప్యూటర్ టీచర్లతో శ్రీకాకుళం లో నెమ్మదిగా ప్రారంభమయినది . 2011 జూలై 10వ తేదిన ఆవిర్భవించింది. సభ్యుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసింది. ఇతర సంఘాలతో భుజం కలిపి పోరాడింది. సమ్మెలకు ఉద్యమాలకు మారుపేరుగా నిలిచింది. కోర్దినేటర్ల వేధింపులకు ఏజెన్సీల మోసాలకు ఎదురు తిరిగింది. ఈ క్రమంలో అనేక మంది సభ్యులు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అన్ని జిల్లాలకు, రాష్ట్రమంతట ACT పేరు మారుమ్రోగింది. నిజాయితీకి నిర్భీతికి చిరునామాగా మారింది కనుకనే రాష్ట్ర స్థాయి సంఘంగా మారింది. చాలిచాలని జీతాలతో బ్రతుకులు ఈడుస్తున్న మన కంప్యూటర్ టీచర్ల దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పనిచేయ్య్లనేదే ACT ఉద్దేశ్యం. అందరి ఉపాధ్యాయుల వలె కంప్యూటర్ టీచర్లు గౌరవప్రదంగా జీవించాలనేదే ACT కర్తవ్యం. అందుకే ఏ రొజూ సభ్యుల నుంచి పైసాకుడా వసూలు చెయ్యలేదు. ఇకముందు కూడా వసూలు చెయ్యదు. వసులూ చేసే అధికారాన్ని ACT ఎవరికీ ఇవ్వలేదు. ACT పేరుతొ వస్తున్న ఈ మెయిల్స్ మరియు SMS లకు ఎవరు స్పందిచ వద్దని ఎవరికీ డబ్బులు చెల్లించవద్దని ACT STATE COMMITTEE కోరుతోంది ACT చందాలకు, వసూళ్ళకు, సభ్యత్వ రుసుములకు వ్యతిరేకం జై కంప్యూటర్ టీచర్ !!! జై జై ACT !!!

Friday, April 4, 2014

మళ్లీ మారిన 'టెన్త్‌' టైమ్‌


- 7 నుంచి జరిగే పరీక్షలన్నీ 11 గంటలకు ప్రారంభం  - ప్రభుత్వ పరీక్షల విభాగం ప్రకటన  ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో 
పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల సమయపాలనలో మళ్లీ మార్పు జరిగింది. ఈనెల 7 నుంచి 17వ తేదీ వరకు జరిగే పరీక్షలన్నీ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒకటిన్నర వరకు నిర్వహించబడతాయి. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు బి మన్మథరెడ్డి బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఎంపిటిసి, జడ్పీటిసి ఎన్నికల పోలింగ్‌ వల్ల టెన్త్‌ పరీక్షల షెడ్యూల్‌లో గతంలోనే స్వల్ప మార్పు జరిగిన విషయం తెలిసిందే. ఈనెల 7న, 12వ తేదీల్లో జరిగే సామాన్యశాస్త్రం పేపర్‌-1, పేపర్‌-2 పరీక్షల నిర్వహణ సమయంలో స్వల్ప మార్పు జరిగిందని ఆయన తెలిపారు. ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు పరీక్షలు జరపడానికి బదులుగా, ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒకటిన్నర వరకు పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించామని పేర్కొన్నారు. అభ్యర్థుల సౌకర్యార్ధం, గందరగోళం తొలగించాలని సమయపాలనలో మళ్లీ మార్పు చేశామని తెలిపారు. ఈనెల 7 నుంచి 17 తేదీ వరకు జరిగే పరీక్షలన్నీ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒకటిన్నర వరకు నిర్వహించబడతాయని పేర్కొన్నారు. అయితే ఈనెల 3న, 4వ తేదీల్లో జరిగే గణితం పేపర్‌-1, పేపర్‌-2లు యథావిధిగా ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించబడతాయని తెలిపారు. పదో తరగతి పరీక్షల సమయపాలనలో వచ్చిన మార్పులను విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఇన్విజిలేటర్లు, చీఫ్‌ సూపరింటెండెంట్లు గమనించాలని కోరారు.

No comments: