MARQUEE

URGENT IMPORTANT APPEAL ACT ( Association for Computer Teachers ) అనే ఉద్యమం కంప్యూటర్ టీచర్లతో శ్రీకాకుళం లో నెమ్మదిగా ప్రారంభమయినది . 2011 జూలై 10వ తేదిన ఆవిర్భవించింది. సభ్యుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసింది. ఇతర సంఘాలతో భుజం కలిపి పోరాడింది. సమ్మెలకు ఉద్యమాలకు మారుపేరుగా నిలిచింది. కోర్దినేటర్ల వేధింపులకు ఏజెన్సీల మోసాలకు ఎదురు తిరిగింది. ఈ క్రమంలో అనేక మంది సభ్యులు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అన్ని జిల్లాలకు, రాష్ట్రమంతట ACT పేరు మారుమ్రోగింది. నిజాయితీకి నిర్భీతికి చిరునామాగా మారింది కనుకనే రాష్ట్ర స్థాయి సంఘంగా మారింది. చాలిచాలని జీతాలతో బ్రతుకులు ఈడుస్తున్న మన కంప్యూటర్ టీచర్ల దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పనిచేయ్య్లనేదే ACT ఉద్దేశ్యం. అందరి ఉపాధ్యాయుల వలె కంప్యూటర్ టీచర్లు గౌరవప్రదంగా జీవించాలనేదే ACT కర్తవ్యం. అందుకే ఏ రొజూ సభ్యుల నుంచి పైసాకుడా వసూలు చెయ్యలేదు. ఇకముందు కూడా వసూలు చెయ్యదు. వసులూ చేసే అధికారాన్ని ACT ఎవరికీ ఇవ్వలేదు. ACT పేరుతొ వస్తున్న ఈ మెయిల్స్ మరియు SMS లకు ఎవరు స్పందిచ వద్దని ఎవరికీ డబ్బులు చెల్లించవద్దని ACT STATE COMMITTEE కోరుతోంది ACT చందాలకు, వసూళ్ళకు, సభ్యత్వ రుసుములకు వ్యతిరేకం జై కంప్యూటర్ టీచర్ !!! జై జై ACT !!!

Saturday, March 15, 2014

ACT NEWS: టీచర్ల సర్వీస్ రెగ్యులరైజేషన్‌కు ప్రత్యేక కార్యాచరణ

టీచర్ల సర్వీస్ రెగ్యులరైజేషన్‌కు ప్రత్యేక కార్యాచరణ
Sakshi | Updated: March 15, 2014 03:05 (IST)
ఒంగోలు ఒన్‌టౌన్, న్యూస్‌లైన్: జిల్లాలో ఉపాధ్యాయుల సర్వీసుల క్రమబద్ధీకరణకు డీఈఓ ఏ రాజేశ్వరరావు ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. విద్యా డివిజన్ వారీగా ఉపాధ్యాయుల సర్వీస్ క్రమబద్ధీకరణకు షెడ్యూల్ ప్రకటించారు. మొదటగా కందుకూరు డివిజన్ పరిధిలోని 17 మండలాల ఉపాధ్యాయుల సర్వీస్ క్రమబద్ధీకరణను చేపట్టనున్నారు.
దీని కోసం స్థానిక డీఆర్‌ఆర్‌ఎం హైస్కూలులో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. మండలాల్లోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలో, ఉన్నత పాఠశాలలో పని చేస్తున్న సెకండరీ గ్రేడు టీచర్లు, భాషా పండితులు, స్కూల్ అసిస్టెంట్లు, ఇతరుల సర్వీస్ రెగ్యులర్ చేస్తారు. 
షెడ్యూలు ఇదీ..
కందుకూరు డివిజన్ పరిధిలోని 17 మండలాల ఎంఈఓలు ఎవరు ఏ రోజు సర్వీస్ క్రమబద్ధీకరణ ప్రతిపాదనలు, సేవాపుస్తకాలు తీసుకురావాలో డీఈఓ షెడ్యూలు ప్రకటించారు. ఈ నెల 24న కందుకూరు, వలేటివారిపాలెం, కొనకనమిట్ల మండలాలు, 25న లింగసముద్రం, గుడ్లూరు, జరుగుమల్లి మండలాలు, 26న ఉలవపాడు, సింగరాయకొండ, కొండపి మండలాలు, 27న పెదచెర్లోపల్లి, పామూరు, మర్రిపూడి మండలాలు, 28న హనుమంతునిపాడు, కనిగిరి, చంద్రశేఖరపురం మండలాలు, 29న వెలిగండ్ల, పొన్నలూరు మండలాల ఎంఈఓలు ఉపాధ్యాయుల సర్వీస్ క్రమబద్ధీకరణ ప్రతిపాదనలు, సర్వీస్ రిజిస్టర్లు, ఒంగోలులోని ప్రత్యేక విభాగంలో సమర్పించాలని కోరారు.

No comments: