MARQUEE

URGENT IMPORTANT APPEAL ACT ( Association for Computer Teachers ) అనే ఉద్యమం కంప్యూటర్ టీచర్లతో శ్రీకాకుళం లో నెమ్మదిగా ప్రారంభమయినది . 2011 జూలై 10వ తేదిన ఆవిర్భవించింది. సభ్యుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసింది. ఇతర సంఘాలతో భుజం కలిపి పోరాడింది. సమ్మెలకు ఉద్యమాలకు మారుపేరుగా నిలిచింది. కోర్దినేటర్ల వేధింపులకు ఏజెన్సీల మోసాలకు ఎదురు తిరిగింది. ఈ క్రమంలో అనేక మంది సభ్యులు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అన్ని జిల్లాలకు, రాష్ట్రమంతట ACT పేరు మారుమ్రోగింది. నిజాయితీకి నిర్భీతికి చిరునామాగా మారింది కనుకనే రాష్ట్ర స్థాయి సంఘంగా మారింది. చాలిచాలని జీతాలతో బ్రతుకులు ఈడుస్తున్న మన కంప్యూటర్ టీచర్ల దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పనిచేయ్య్లనేదే ACT ఉద్దేశ్యం. అందరి ఉపాధ్యాయుల వలె కంప్యూటర్ టీచర్లు గౌరవప్రదంగా జీవించాలనేదే ACT కర్తవ్యం. అందుకే ఏ రొజూ సభ్యుల నుంచి పైసాకుడా వసూలు చెయ్యలేదు. ఇకముందు కూడా వసూలు చెయ్యదు. వసులూ చేసే అధికారాన్ని ACT ఎవరికీ ఇవ్వలేదు. ACT పేరుతొ వస్తున్న ఈ మెయిల్స్ మరియు SMS లకు ఎవరు స్పందిచ వద్దని ఎవరికీ డబ్బులు చెల్లించవద్దని ACT STATE COMMITTEE కోరుతోంది ACT చందాలకు, వసూళ్ళకు, సభ్యత్వ రుసుములకు వ్యతిరేకం జై కంప్యూటర్ టీచర్ !!! జై జై ACT !!!

Tuesday, February 18, 2014

మహాధర్నాలో విషాదం..

ఢిల్లీ : ఎపిఎన్జీఓ నిర్వహిస్తున్న మహాధర్నాలో విషాదం నెలకొంది. ఎపిఎన్జీఓ నేత, నెల్లూరు జిల్లాకు చెందిన దామోదర్ గుండెపోటుతో మృతి చెందారు. ఆయన మృతికి సంతాప సూచకంగా ఎపిఎన్జీఓలు రెండు నిమిషాల పాటు మౌనం వహించారు. సమైక్య రాష్ట్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రాంలీలా మైదానంలో రెండు రోజుల పాటు ధర్నా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ధర్నాలో పాల్గొనేందుకు నెల్లూరు జిల్లాకు చెందిన దామోదర్ వచ్చారు. సోమవారం ఉదయం గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయాడు. వెంటనే ఇతడిని ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యంలోనే దామోదర్ మృతి చెందారు. దామోదర్ మృతి పట్ల ఎపిఎన్జీఓ సంతాపం ప్రకటించింది. రాష్ట్ర విభజన బిల్లు ఈనెల 13వ తేదీన లోక్ సభలో ప్రవేశ పెడుతున్న సందర్భంలో జరిగిన గందరగోళ పరిస్థితుల్లో టిడిపి నేత కొనకళ్లకు గుండెపోటు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

No comments: