MARQUEE

URGENT IMPORTANT APPEAL ACT ( Association for Computer Teachers ) అనే ఉద్యమం కంప్యూటర్ టీచర్లతో శ్రీకాకుళం లో నెమ్మదిగా ప్రారంభమయినది . 2011 జూలై 10వ తేదిన ఆవిర్భవించింది. సభ్యుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసింది. ఇతర సంఘాలతో భుజం కలిపి పోరాడింది. సమ్మెలకు ఉద్యమాలకు మారుపేరుగా నిలిచింది. కోర్దినేటర్ల వేధింపులకు ఏజెన్సీల మోసాలకు ఎదురు తిరిగింది. ఈ క్రమంలో అనేక మంది సభ్యులు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అన్ని జిల్లాలకు, రాష్ట్రమంతట ACT పేరు మారుమ్రోగింది. నిజాయితీకి నిర్భీతికి చిరునామాగా మారింది కనుకనే రాష్ట్ర స్థాయి సంఘంగా మారింది. చాలిచాలని జీతాలతో బ్రతుకులు ఈడుస్తున్న మన కంప్యూటర్ టీచర్ల దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పనిచేయ్య్లనేదే ACT ఉద్దేశ్యం. అందరి ఉపాధ్యాయుల వలె కంప్యూటర్ టీచర్లు గౌరవప్రదంగా జీవించాలనేదే ACT కర్తవ్యం. అందుకే ఏ రొజూ సభ్యుల నుంచి పైసాకుడా వసూలు చెయ్యలేదు. ఇకముందు కూడా వసూలు చెయ్యదు. వసులూ చేసే అధికారాన్ని ACT ఎవరికీ ఇవ్వలేదు. ACT పేరుతొ వస్తున్న ఈ మెయిల్స్ మరియు SMS లకు ఎవరు స్పందిచ వద్దని ఎవరికీ డబ్బులు చెల్లించవద్దని ACT STATE COMMITTEE కోరుతోంది ACT చందాలకు, వసూళ్ళకు, సభ్యత్వ రుసుములకు వ్యతిరేకం జై కంప్యూటర్ టీచర్ !!! జై జై ACT !!!

Friday, December 27, 2013

Due to expire in computer education -- కంప్యూటర్ విద్యకు మంగళం...


హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ఎంతో ఆర్బాటంగా ఐసిటి పథకం కింద ప్రవేశపెట్టిన కంప్యూటర్ విద్య ఈరోజుతో ముగియనుంది. దీంతో 5 వేల ప్రభుత్వ స్కూళ్లలో కంప్యూటర్‌ విద్య ప్రశ్నార్ధకంగా మారనుంది. దాదాపు పది వేల మంది కంప్యూటర్‌ టీచర్లు ఉపాధి కోల్పోనున్నారు. వేలాది విద్యార్థులు కంప్యూటర్‌ విద్యకు దూరమయ్యే ప్రమాదం ముంచుకొస్తోంది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఐసిటి పథకం కింద 2008 సంవత్సరం నుంచి కంప్యూటర్‌ విద్యను అందిస్తున్నారు. 5 వేల ప్రభుత్వ పాఠశాలల్లో ప్రారంభమైన ఈ పథకం ఇవాళ్టితో ముగుస్తోంది. ఈ అయిదేళ్లలో ఐసిటి పథకం కింద దాదాపు 500 కోట్ల రూపాయల దాకా ఖర్చు చేశారు. ఇప్పటిదాకా 75 శాతం నిధులను కేంద్రమే సమకూర్చింది. ఇవాళ్టితో కేంద్రం ఇచ్చే నిధులకు కాలపరిమితి ముగిసింది. ఈ పథకం కొనసాగాలంటే రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి నిధులు సమకూర్చాలి. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకానికి మంగళంపాడుతోంది. ఈ స్కూళ్లలోని పది వేల మంది కాంట్రాక్టు కంప్యూటర్ టీచర్ల సర్వీసును నిలుపుదల చేస్తూ జీవో జారీ చేసింది. దీంతో ఇంతమంది కంప్యూటర్‌ టీచర్లు ఒక్కసారిగా ఉపాధి కోల్పోతున్నారు. మరోవైపు వేలాది పేద విద్యార్థులు కంప్యూటర్‌ విద్యకు దూరమయ్యే ప్రమాదం ఏర్పడింది. ఇంతకాలమూ వీటిమీద పెట్టిన ఖర్చు వృథా అయ్యే పరిస్థితి ఏర్పడింది. స్కూల్స్ లోని కంప్యూటర్‌ ల్యాబ్‌లను వృథాగా మూలన పడేయాల్సిన దుస్థితి దాపురించింది. కేవలం పాతిక ముప్పై కోట్లు కేటాయిస్తే కంప్యూటర్‌ విద్యను కొనసాగించవచ్చని విద్యారంగ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని కొనసాగించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల పదివేల మంది టీచర్లు వీధినపడకుండా వుంటారు. మరోవైపు పేద విద్యార్థులు కంప్యూటర్‌ పరిజ్ఞానం అందిపుచ్చుకోగలుగుతారు.

No comments: