MARQUEE

URGENT IMPORTANT APPEAL ACT ( Association for Computer Teachers ) అనే ఉద్యమం కంప్యూటర్ టీచర్లతో శ్రీకాకుళం లో నెమ్మదిగా ప్రారంభమయినది . 2011 జూలై 10వ తేదిన ఆవిర్భవించింది. సభ్యుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసింది. ఇతర సంఘాలతో భుజం కలిపి పోరాడింది. సమ్మెలకు ఉద్యమాలకు మారుపేరుగా నిలిచింది. కోర్దినేటర్ల వేధింపులకు ఏజెన్సీల మోసాలకు ఎదురు తిరిగింది. ఈ క్రమంలో అనేక మంది సభ్యులు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అన్ని జిల్లాలకు, రాష్ట్రమంతట ACT పేరు మారుమ్రోగింది. నిజాయితీకి నిర్భీతికి చిరునామాగా మారింది కనుకనే రాష్ట్ర స్థాయి సంఘంగా మారింది. చాలిచాలని జీతాలతో బ్రతుకులు ఈడుస్తున్న మన కంప్యూటర్ టీచర్ల దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పనిచేయ్య్లనేదే ACT ఉద్దేశ్యం. అందరి ఉపాధ్యాయుల వలె కంప్యూటర్ టీచర్లు గౌరవప్రదంగా జీవించాలనేదే ACT కర్తవ్యం. అందుకే ఏ రొజూ సభ్యుల నుంచి పైసాకుడా వసూలు చెయ్యలేదు. ఇకముందు కూడా వసూలు చెయ్యదు. వసులూ చేసే అధికారాన్ని ACT ఎవరికీ ఇవ్వలేదు. ACT పేరుతొ వస్తున్న ఈ మెయిల్స్ మరియు SMS లకు ఎవరు స్పందిచ వద్దని ఎవరికీ డబ్బులు చెల్లించవద్దని ACT STATE COMMITTEE కోరుతోంది ACT చందాలకు, వసూళ్ళకు, సభ్యత్వ రుసుములకు వ్యతిరేకం జై కంప్యూటర్ టీచర్ !!! జై జై ACT !!!

Saturday, December 21, 2013

కంప్యూటర్ దొంగల అరెస్టు

ఎగ్జిబిషన్ కాదిది...చోరీ సొత్తు! 
Sakshi | Updated: December 21, 2013 09:09 (IST)  
కాకినాడ : పక్కన ఫోటోలో చూస్తున్న కంప్యూటర్లు మానిటర్లు, సీపీయూలు, మౌస్లు .... ఎగ్జిబిషన్ కోసం పెట్టారనుకుంటే మీరు 'మౌస్' మీద కాలేసినట్లే. ఉభయ గోదావరి జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో ఊరికి దూరంగా ఉండే ప్రభుత్వ పాఠశాలల్ఓ దొంగలు కాజేసిన కంప్యూటర్లు ఇవన్నీ. పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్లకు చెందిన నరెళ్ల శ్రీనివాసరావు, రాజు, తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం మండలం కాండ్రకోటకు చెందిన గ్రంథి గంగాధర్ వీటిని దొంగలించి, ఇంటర్నెట్, కంప్యూటర్ సెంటర్లలో విక్రయిస్తున్నారు.
పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి నిన్న మీడియా ముందు హాజరు పరిచారు. నిందితులు మొత్తల 32 చోరీలకు పాల్పడినట్లు తెలిపారు. 48 సీపీయూలు, 87 మానిటర్లు, 58 మౌస్లు, 51 కీబోర్డులు, బైకు, ల్యాప్టాప్, వెండి కిరీటం, కవచం, కత్తి, వెండి పిడికిలి, అమ్మవారి ముక్కుపుడక, బొట్టును వీరు కాజేసిన జాబితాలో ఉన్నాయి.
కంప్యూటర్ దొంగల అరెస్టు
Sakshi | Updated: December 21, 2013 03:03 (IST)
ఊరి చివర స్కూళ్లే లక్ష్యం
రూ.8.83 లక్షల విలువైన 
సొత్తు స్వాధీనం
కాకినాడ రూరల్, న్యూస్‌లైన్ :
వివిధ నేరాలకు పాల్పడిన ము గ్గురు నిందితులను అరెస్టు చేసి, వారి నుంచి రూ.8.83 లక్షల విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్టు జిల్లా ఎస్పీ పి.శివశంకరరెడ్డి తెలిపారు. సర్పవరం జంక్షన్‌లోని పోలీసు గెస్ట్‌హౌస్ లో శుక్రవారం విలేకరులకు కేసు వివరాలు తెలిపారు. పశ్చిమ గోదావరి జి ల్లా నల్లజర్లకు చెందిన సరెళ్ల శ్రీనివాసరావు, సరెళ్ల రాజు, పెద్దాపురం మం డలం కాండ్రకోటకు చెందిన గ్రంధి గంగాధర్ ఒకే బైక్‌పై వెళ్తుండగా, కిర్లం పూడి మండలం రామచంద్రపురంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నా రు. కిర్లంపూడి పోలీసు స్టేషన్ పరిధిలో చోరీ అయిన కొత్త బైక్ విషయమై విచా రణ చేయగా, అనేక దొంగతనాలు వెలుగులోకి వచ్చాయి. నింది తులు మొత్తం 32 నేరాలకు పాల్పడగా, జిల్లాలో 28 నేరాలు, పశ్చిమ గోదావరి లో 4 నేరాలు చేశారు. ఊరి శివారులో ఉండే ప్రభుత్వ పాఠశాలలను లక్ష్యం చేసుకుని కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, వివిధ దేవాలయాల్లో బంగారు, వెండి ఆభరణాలు దొంగిలించారు.
కోటనందూరు, ఆలమూరు, ప్రత్తిపాడు, రంగంపేట, సర్పవరం, పిఠాపురం, గొల్లప్రోలు, తొండంగి, కోరం గి, గొల్లపాలెం, బిక్కవోలు, ఇంద్రపాలెం, కాట్రేనికోన, ఏలేశ్వరం, రావులపాలెం, అంబాజీపేట, సామర్లకోట, రాజానగరం, జగ్గంపేటల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో, పశ్చిమ గోదావరి జిల్లాలోని పెదప్పాడు, ఇరగవరం పాఠశాలల్లోను కంప్యూటర్లు దొంగిలించారు. అత్తిలిలోని రెండు దేవాలయాల్లో చోరీ లకు పాల్పడ్డారు. మొత్తం 48 సీపీయూలు, 87 మెనిటర్లు, 58 మౌస్‌లు, 51 కీబోర్డులు, బైకు, ల్యాప్‌టాప్, వెండి కిరీటం, కవచం, కత్తి, వెండి పిడికిలి, అమ్మవారి ముక్కుపుడక, బొట్టు ను వీరు కాజేశారు. వీటిని ఆక్షన్లలో పాడుకున్న వస్తువులుగా నమ్మించి ఇం టర్నెట్ సెంటర్లలో, కంప్యూటర్ షా పుల్లో, ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముతున్నారు. సమావేశంలో డీఎస్పీ వి.అరవింద్‌బాబు, జగ్గంపేట సీఐ మురళీమోహన్, కిర్లంపూడి, పెద్దాపురం క్రైం ఎస్సైలు పాల్గొన్నారు. నిందితులను ప్రత్తిపాడు కోర్టుకు తరలిస్తున్నట్టు ఎస్పీ తెలిపారు.

No comments: