MARQUEE

URGENT IMPORTANT APPEAL ACT ( Association for Computer Teachers ) అనే ఉద్యమం కంప్యూటర్ టీచర్లతో శ్రీకాకుళం లో నెమ్మదిగా ప్రారంభమయినది . 2011 జూలై 10వ తేదిన ఆవిర్భవించింది. సభ్యుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసింది. ఇతర సంఘాలతో భుజం కలిపి పోరాడింది. సమ్మెలకు ఉద్యమాలకు మారుపేరుగా నిలిచింది. కోర్దినేటర్ల వేధింపులకు ఏజెన్సీల మోసాలకు ఎదురు తిరిగింది. ఈ క్రమంలో అనేక మంది సభ్యులు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అన్ని జిల్లాలకు, రాష్ట్రమంతట ACT పేరు మారుమ్రోగింది. నిజాయితీకి నిర్భీతికి చిరునామాగా మారింది కనుకనే రాష్ట్ర స్థాయి సంఘంగా మారింది. చాలిచాలని జీతాలతో బ్రతుకులు ఈడుస్తున్న మన కంప్యూటర్ టీచర్ల దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పనిచేయ్య్లనేదే ACT ఉద్దేశ్యం. అందరి ఉపాధ్యాయుల వలె కంప్యూటర్ టీచర్లు గౌరవప్రదంగా జీవించాలనేదే ACT కర్తవ్యం. అందుకే ఏ రొజూ సభ్యుల నుంచి పైసాకుడా వసూలు చెయ్యలేదు. ఇకముందు కూడా వసూలు చెయ్యదు. వసులూ చేసే అధికారాన్ని ACT ఎవరికీ ఇవ్వలేదు. ACT పేరుతొ వస్తున్న ఈ మెయిల్స్ మరియు SMS లకు ఎవరు స్పందిచ వద్దని ఎవరికీ డబ్బులు చెల్లించవద్దని ACT STATE COMMITTEE కోరుతోంది ACT చందాలకు, వసూళ్ళకు, సభ్యత్వ రుసుములకు వ్యతిరేకం జై కంప్యూటర్ టీచర్ !!! జై జై ACT !!!

Sunday, August 4, 2013

108 ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలి లేదంటే ఆందోళన ఉధృతం:సిఐటియు

108 ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలి లేదంటే ఆందోళన ఉధృతం:సిఐటియు
ప్రజాశక్తి-ఖమ్మం Sat, 3 Aug 2013, IST
108 ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల పరిష్కరించాలని లేదంటే జివికె హెడ్డాఫీసును, సచివాలయాన్ని దిగ్భందం చేస్తామని సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎజె.రమేష్‌ హెచ్చరించారు. సమ్మె శనివారానికి 16 రోజులకు చేరింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల శసహనాన్ని పరీక్షించొద్దని పేర్కొన్నారు. 8 గంటల పని దినం అమలు చేస్తామని హామీ ఇచ్చినా ఇంత వరకూ అమలు చేయలేదని అన్నారు. డిమాండ్లు పరిష్కారమయ్యే వరకూ సమ్మె కొనసాగుతుందని అన్నారు. 6వ తేదీన చలో హైదరాబాదు నిర్వహించి సచివాలయాన్ని జివికెని దిగ్భందనం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు కె.నరసింహారావు, 108 యూనియన్‌ జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్‌, రవికుమార్‌, శ్రీను, లక్ష్మణ్‌, ఆంటోని, సుధాకర్‌, దయాకర్‌, కృష్ణ, వెంకట్‌, రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు. 


No comments: