MARQUEE

URGENT IMPORTANT APPEAL ACT ( Association for Computer Teachers ) అనే ఉద్యమం కంప్యూటర్ టీచర్లతో శ్రీకాకుళం లో నెమ్మదిగా ప్రారంభమయినది . 2011 జూలై 10వ తేదిన ఆవిర్భవించింది. సభ్యుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసింది. ఇతర సంఘాలతో భుజం కలిపి పోరాడింది. సమ్మెలకు ఉద్యమాలకు మారుపేరుగా నిలిచింది. కోర్దినేటర్ల వేధింపులకు ఏజెన్సీల మోసాలకు ఎదురు తిరిగింది. ఈ క్రమంలో అనేక మంది సభ్యులు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అన్ని జిల్లాలకు, రాష్ట్రమంతట ACT పేరు మారుమ్రోగింది. నిజాయితీకి నిర్భీతికి చిరునామాగా మారింది కనుకనే రాష్ట్ర స్థాయి సంఘంగా మారింది. చాలిచాలని జీతాలతో బ్రతుకులు ఈడుస్తున్న మన కంప్యూటర్ టీచర్ల దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పనిచేయ్య్లనేదే ACT ఉద్దేశ్యం. అందరి ఉపాధ్యాయుల వలె కంప్యూటర్ టీచర్లు గౌరవప్రదంగా జీవించాలనేదే ACT కర్తవ్యం. అందుకే ఏ రొజూ సభ్యుల నుంచి పైసాకుడా వసూలు చెయ్యలేదు. ఇకముందు కూడా వసూలు చెయ్యదు. వసులూ చేసే అధికారాన్ని ACT ఎవరికీ ఇవ్వలేదు. ACT పేరుతొ వస్తున్న ఈ మెయిల్స్ మరియు SMS లకు ఎవరు స్పందిచ వద్దని ఎవరికీ డబ్బులు చెల్లించవద్దని ACT STATE COMMITTEE కోరుతోంది ACT చందాలకు, వసూళ్ళకు, సభ్యత్వ రుసుములకు వ్యతిరేకం జై కంప్యూటర్ టీచర్ !!! జై జై ACT !!!

Friday, October 10, 2014

ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ 'మిథ్య' 10:08 - September 11, 2014


హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్భాటంగా ప్రారంభించిన కంప్యూటర్ విద్య మిథ్యగా మారుతోంది. కంప్యూటర్ల మంజూరు, సిబ్బంధి కేటాయింపు చకచకా చేసినా అది ఆరంభ శూరత్వంగానే మిగిలిపోయింది. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ విద్య అగమ్య గోచరంగా తయారయింది. ఏయే కారణాలు దీన్ని ప్రభావితంచేస్తున్నాయో చూద్దాం..

2008లో కంప్యూటర్ల మంజూరు..

రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు 2008 లో కంప్యూటర్లు మంజూరయ్యాయి. ఒక్కో పాఠశాలకు 11 కంప్యూటర్ల చొప్పున పాఠశాల విద్యాశాఖ మంజూరు చేసింది. ప్రత్యేక గదులు మౌలికసదుపాయాలు కల్పించారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో ఇప్పుడు కంప్యూటర్లు బూజుపడుతున్నాయి. ప్రకాశం జిల్లాల్లో 30 పాఠశాలల్లో 100కు పైగా కంప్యూటర్లు మాయమయ్యాయి. వరసగా పాఠశాలల్లో కంప్యూటర్లు పోయినా.. ఫిర్యాదు చేసి చేతులు దులుపుకుంటున్నారు అధికారులు. 
కంప్యూటర్ గదులకు తాళాలు..
ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ టీచర్లను తీసివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో కాంట్రాక్ట్ పద్దతిపై పనిచేస్తున్న కంప్యూటర్‌ టీచర్ల లేకుండా పోయారు. దీంతో కొద్ది రోజులుగా చాలా పాఠశాలల్లో కంప్యూటర్ గదులకు తాళాలు పడ్డాయి. పాఠాలు చెప్పే టీచర్లు లేకపోవడంతో విద్యార్ధులకు నేర్చుకునే అవకాశం లేకుండా పోయింది. ప్రభుత్వం ఆర్భాటంగా కంప్యూటర్ విద్యను ప్రవేశపెట్టి.. ఇప్పుడు కంప్యూటర్ బోధకులను తొలగించడంపై విద్యా సంఘాలు తప్పుపడుతున్నాయి. పోటీ ప్రపంచంలో తప్పనిసరిగా మారిన కంప్యూటర్ విద్యను పాఠశాల స్థాయిలోనే అందిస్తామని ప్రభుత్వం ఓవైపు గొప్పగా ప్రచారం చేస్తూనే భారం పేరుతో సిబ్బందిని తొలగించింది. అయితే పాఠశాలలోని ఏదో ఒక ఉపాధ్యాయుడికి కంప్యూటర్‌ శిక్షణ ఇచ్చి విద్యార్ధులకు విధ్యను బోధించాలని ప్రభుత్వం చెబుతోంది. అయితే సబ్జెక్టులు బోధించే ఉపాధ్యాయులకు ఇది వీలుకాదని, సిలబస్ ను పూర్తిచేయడానికే సమయం చాలడం లేదని ఉపాధ్యాయ సంఘాలంటున్నాయి. 
చిత్తశుద్ధితో వ్యవహరించాలి..
చిన్ననాటి నుంచే కంప్యూటర్ విధ్యను అందించి ప్రయివేటు పాఠశాలల్లో చదివే విద్యార్ధులకు ధీటుగా సర్కారీ విద్యార్ధులను తయారుచేస్తామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంది. కానీ ఆచరణలో అమలు కావడం లేదు. ఇప్పటికైనా  ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించి సర్కార్ బడుల్లో కంప్యూటర్ విధ్యను బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా వుంది. 

No comments: