MARQUEE

URGENT IMPORTANT APPEAL ACT ( Association for Computer Teachers ) అనే ఉద్యమం కంప్యూటర్ టీచర్లతో శ్రీకాకుళం లో నెమ్మదిగా ప్రారంభమయినది . 2011 జూలై 10వ తేదిన ఆవిర్భవించింది. సభ్యుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసింది. ఇతర సంఘాలతో భుజం కలిపి పోరాడింది. సమ్మెలకు ఉద్యమాలకు మారుపేరుగా నిలిచింది. కోర్దినేటర్ల వేధింపులకు ఏజెన్సీల మోసాలకు ఎదురు తిరిగింది. ఈ క్రమంలో అనేక మంది సభ్యులు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అన్ని జిల్లాలకు, రాష్ట్రమంతట ACT పేరు మారుమ్రోగింది. నిజాయితీకి నిర్భీతికి చిరునామాగా మారింది కనుకనే రాష్ట్ర స్థాయి సంఘంగా మారింది. చాలిచాలని జీతాలతో బ్రతుకులు ఈడుస్తున్న మన కంప్యూటర్ టీచర్ల దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పనిచేయ్య్లనేదే ACT ఉద్దేశ్యం. అందరి ఉపాధ్యాయుల వలె కంప్యూటర్ టీచర్లు గౌరవప్రదంగా జీవించాలనేదే ACT కర్తవ్యం. అందుకే ఏ రొజూ సభ్యుల నుంచి పైసాకుడా వసూలు చెయ్యలేదు. ఇకముందు కూడా వసూలు చెయ్యదు. వసులూ చేసే అధికారాన్ని ACT ఎవరికీ ఇవ్వలేదు. ACT పేరుతొ వస్తున్న ఈ మెయిల్స్ మరియు SMS లకు ఎవరు స్పందిచ వద్దని ఎవరికీ డబ్బులు చెల్లించవద్దని ACT STATE COMMITTEE కోరుతోంది ACT చందాలకు, వసూళ్ళకు, సభ్యత్వ రుసుములకు వ్యతిరేకం జై కంప్యూటర్ టీచర్ !!! జై జై ACT !!!

Saturday, May 10, 2014

EENADU MAIN PAPER PAGE NO 6, DATE 21-05-2014

  
       
ఘనంగా రవీంద్రుడి జయంతి ఉత్సవాలు          
   కోల్‌కతా : విశ్వకవి రవీంద్రుడి ఉత్సవాలు శుక్రవారం నాడు భారత్‌లో ఘనంగా జరిగాయి. రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ 153వ జయంతి ఉత్సవాల్ని పశ్చిమ బెంగాల్‌లో, దేశంలో ఇతర చోట్ల నివసిస్తున్న బెంగాలీలు ఘనంగా నిర్వహించారు. రవీంద్రుడి జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న భారత రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ మాట్లాడుతూ..'గొప్ప జాతీయవాది,
ఆలోచనావాది అయిన గురుదేవ్‌ రవీంద్రుడ్ని ప్రతి భారతీయుడూ గుర్తుచేసుకుంటున్నాడు. నేనూ వారిలో ఒకరిగా రవీంద్రుడికి నివాళి అర్పిస్తున్నా. గొప్ప వ్యక్తిత్వం వున్న రవీంద్రుడు కాలానికి అతీతమైన భావనలు అందించారు. మనలో మానవత్వ స్ఫూర్తిని రగిలించారు' అని పేర్కొన్నారు. ఇతరుల సంస్కృతీ, సాంప్రదాయాల్ని గౌరవిస్తూనే అస్తిత్వాన్ని తెలియజేసే గొప్ప సాహిత్యాన్ని రూపకల్పన చేసిన వ్యక్తిగా ఠాగూర్‌ను రాష్ట్రపతి కొనియాడారు. ఆధునిక భారతదేశ చరిత్రలో ఆయన్ని క్రియెటివ్‌ జీనియస్‌గా ప్రణబ్‌ ముఖర్జీ పేర్కొన్నారు. అలాగే పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్‌ సర్కార్‌ రవీంద్రుడి జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. కోల్‌కతాలోని ఠాకూర్‌ నివసించిన ఇంట్లో రవీంద్రుడి జయంతి సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

No comments: