MARQUEE

URGENT IMPORTANT APPEAL ACT ( Association for Computer Teachers ) అనే ఉద్యమం కంప్యూటర్ టీచర్లతో శ్రీకాకుళం లో నెమ్మదిగా ప్రారంభమయినది . 2011 జూలై 10వ తేదిన ఆవిర్భవించింది. సభ్యుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసింది. ఇతర సంఘాలతో భుజం కలిపి పోరాడింది. సమ్మెలకు ఉద్యమాలకు మారుపేరుగా నిలిచింది. కోర్దినేటర్ల వేధింపులకు ఏజెన్సీల మోసాలకు ఎదురు తిరిగింది. ఈ క్రమంలో అనేక మంది సభ్యులు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అన్ని జిల్లాలకు, రాష్ట్రమంతట ACT పేరు మారుమ్రోగింది. నిజాయితీకి నిర్భీతికి చిరునామాగా మారింది కనుకనే రాష్ట్ర స్థాయి సంఘంగా మారింది. చాలిచాలని జీతాలతో బ్రతుకులు ఈడుస్తున్న మన కంప్యూటర్ టీచర్ల దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పనిచేయ్య్లనేదే ACT ఉద్దేశ్యం. అందరి ఉపాధ్యాయుల వలె కంప్యూటర్ టీచర్లు గౌరవప్రదంగా జీవించాలనేదే ACT కర్తవ్యం. అందుకే ఏ రొజూ సభ్యుల నుంచి పైసాకుడా వసూలు చెయ్యలేదు. ఇకముందు కూడా వసూలు చెయ్యదు. వసులూ చేసే అధికారాన్ని ACT ఎవరికీ ఇవ్వలేదు. ACT పేరుతొ వస్తున్న ఈ మెయిల్స్ మరియు SMS లకు ఎవరు స్పందిచ వద్దని ఎవరికీ డబ్బులు చెల్లించవద్దని ACT STATE COMMITTEE కోరుతోంది ACT చందాలకు, వసూళ్ళకు, సభ్యత్వ రుసుములకు వ్యతిరేకం జై కంప్యూటర్ టీచర్ !!! జై జై ACT !!!

Wednesday, August 21, 2013

32వ రోజుకు చేరుకున్న 108 సిబ్బంది సమ్మె

32వ రోజుకు చేరుకున్న 108 సిబ్బంది సమ్మె

ప్రజాశక్తి - కలెక్టరేట్‌   Tue, 20 Aug 2013, IST  
సమస్యల పరిష్కారానికి రాష్ట్ర వ్యాప్తంగా 108 సర్వీసుల ఉద్యోగుల సంఘం చేస్తున్న సమ్మె 32వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా జిల్లా కేంద్ర ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో మంగళవారం సిబ్బంది చేతులను తాళ్లతో బంధించుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యోగులు ప్రభాకర్‌, త్రినాధ తదితరులు మాట్లాడుతూ ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్‌లు సాధించేందుకు వీలు లేకుండా తమను తాళ్లతో బంధించి కక్ష సాధింపులకు పాల్పడుతుందని అన్నారు. అనుభవంలేని వారితో వాహనాలు నడిపిస్తూ ప్రజల ప్రాణాలతో జివిఎంకె యాజమాన్యం ఆడుకుంటుందని అన్నారు. కార్యక్రమంలో 108 సర్వీసుల ఉద్యోగుల సంఘం నాయకులు తిరుపతిరావు, శ్రీను, బాలరాజు తదితరులు పాల్గొన్నారు. 

No comments: