MARQUEE

URGENT IMPORTANT APPEAL ACT ( Association for Computer Teachers ) అనే ఉద్యమం కంప్యూటర్ టీచర్లతో శ్రీకాకుళం లో నెమ్మదిగా ప్రారంభమయినది . 2011 జూలై 10వ తేదిన ఆవిర్భవించింది. సభ్యుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసింది. ఇతర సంఘాలతో భుజం కలిపి పోరాడింది. సమ్మెలకు ఉద్యమాలకు మారుపేరుగా నిలిచింది. కోర్దినేటర్ల వేధింపులకు ఏజెన్సీల మోసాలకు ఎదురు తిరిగింది. ఈ క్రమంలో అనేక మంది సభ్యులు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అన్ని జిల్లాలకు, రాష్ట్రమంతట ACT పేరు మారుమ్రోగింది. నిజాయితీకి నిర్భీతికి చిరునామాగా మారింది కనుకనే రాష్ట్ర స్థాయి సంఘంగా మారింది. చాలిచాలని జీతాలతో బ్రతుకులు ఈడుస్తున్న మన కంప్యూటర్ టీచర్ల దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పనిచేయ్య్లనేదే ACT ఉద్దేశ్యం. అందరి ఉపాధ్యాయుల వలె కంప్యూటర్ టీచర్లు గౌరవప్రదంగా జీవించాలనేదే ACT కర్తవ్యం. అందుకే ఏ రొజూ సభ్యుల నుంచి పైసాకుడా వసూలు చెయ్యలేదు. ఇకముందు కూడా వసూలు చెయ్యదు. వసులూ చేసే అధికారాన్ని ACT ఎవరికీ ఇవ్వలేదు. ACT పేరుతొ వస్తున్న ఈ మెయిల్స్ మరియు SMS లకు ఎవరు స్పందిచ వద్దని ఎవరికీ డబ్బులు చెల్లించవద్దని ACT STATE COMMITTEE కోరుతోంది ACT చందాలకు, వసూళ్ళకు, సభ్యత్వ రుసుములకు వ్యతిరేకం జై కంప్యూటర్ టీచర్ !!! జై జై ACT !!!

Tuesday, February 25, 2014

ఏ ఆదేశాలు లేకుండా అరెస్టులు జరిగాయా - ప్రొ.నాగేశ్వర్.. Posted on: Mon 24 Feb 16:08:07.703851 2014


హైదరాబాద్ : అంగన్ వాడీ కార్మికులపై ప్రభుత్వం వ్యవహరించిన తీరును ఎమ్మెల్సీ, ప్రొ.కె.నాగేశ్వర్ 
తప్పుబట్టారు. ఏ ఆదేశాలు లేకుండా అంగన్ వాడీ కార్మికులను అరెస్టు చేశారా ? అని ఆయన ప్రశ్నించారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఇందిరాపార్కు వద్ద ఆందోళన చేస్తున్న అంగన్ వాడీ కార్మికులపై పోలీసులు ప్రతాపం చూపిన సంగతి తెలిసిందే. అంగన్ వాడీలకు మద్దతు తెలిపేందుకు ప్రొ.ఎమ్మెల్సీ కె.నాగేశ్వర్ ఇందిరాపార్కుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ధర్నాలో పాల్గొనేందుకు వస్తున్న అంగన్ వాడీలను పోలీసులు ఎక్కడికక్కడనే అరెస్టు చేశారని, మాకున్న సమాచారం మేరకు 25-30వేల అంగన్ వాడీలను పోలీసులు అరెస్టు చేశారని పేర్కొన్నారు. ఆదివారం రాత్రి ఇంటింటికి వెళ్లి అరెస్టు చేశారని, ప్రభుత్వం లేకపోతే అరెస్టులు జరిగేవా ? ఏ యంత్రాంగం ఆదేశాలు ఇచ్చిందో ఆ యంత్రాగమే సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వీరి సమస్యలు తీర్చాలని ప్రభుత్వం దృష్టికి పలుమార్లు తీసుకొచ్చినా పరిష్కరించలేదని నాగేశ్వర్ విమర్శించారు.

No comments: