MARQUEE

URGENT IMPORTANT APPEAL ACT ( Association for Computer Teachers ) అనే ఉద్యమం కంప్యూటర్ టీచర్లతో శ్రీకాకుళం లో నెమ్మదిగా ప్రారంభమయినది . 2011 జూలై 10వ తేదిన ఆవిర్భవించింది. సభ్యుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసింది. ఇతర సంఘాలతో భుజం కలిపి పోరాడింది. సమ్మెలకు ఉద్యమాలకు మారుపేరుగా నిలిచింది. కోర్దినేటర్ల వేధింపులకు ఏజెన్సీల మోసాలకు ఎదురు తిరిగింది. ఈ క్రమంలో అనేక మంది సభ్యులు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అన్ని జిల్లాలకు, రాష్ట్రమంతట ACT పేరు మారుమ్రోగింది. నిజాయితీకి నిర్భీతికి చిరునామాగా మారింది కనుకనే రాష్ట్ర స్థాయి సంఘంగా మారింది. చాలిచాలని జీతాలతో బ్రతుకులు ఈడుస్తున్న మన కంప్యూటర్ టీచర్ల దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పనిచేయ్య్లనేదే ACT ఉద్దేశ్యం. అందరి ఉపాధ్యాయుల వలె కంప్యూటర్ టీచర్లు గౌరవప్రదంగా జీవించాలనేదే ACT కర్తవ్యం. అందుకే ఏ రొజూ సభ్యుల నుంచి పైసాకుడా వసూలు చెయ్యలేదు. ఇకముందు కూడా వసూలు చెయ్యదు. వసులూ చేసే అధికారాన్ని ACT ఎవరికీ ఇవ్వలేదు. ACT పేరుతొ వస్తున్న ఈ మెయిల్స్ మరియు SMS లకు ఎవరు స్పందిచ వద్దని ఎవరికీ డబ్బులు చెల్లించవద్దని ACT STATE COMMITTEE కోరుతోంది ACT చందాలకు, వసూళ్ళకు, సభ్యత్వ రుసుములకు వ్యతిరేకం జై కంప్యూటర్ టీచర్ !!! జై జై ACT !!!

Sunday, January 26, 2014

సక్సెస్ కాలేదు

Sakshi | Updated: January 20, 2014 03:32 (IST)

సర్కారు పాఠశాలల్లో కంప్యూటర్ విద్య అటకెక్కింది. అధ్యాపకులు లేక కంప్యూటర్లు మూలకు చేరాయి. ముఖ్యంగా సక్సెస్ పాఠశాలల్లోని విద్యార్థులు కంప్యూటర్‌విద్యకు దూరమవుతున్నారు. సాఫ్ట్‌వేర్ రంగానికి ఉన్న డిమాం డ్ దృష్ట్యా కొన్ని కార్పొరేట్‌పాఠశాలలు ఎల్‌కేజీ నుంచే పిల్లలకు కంప్యూటర్ పాఠాలు బోధిస్తున్నాయి. దాంతో పలువురు తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు స్కూళ్లలోనే చేరుస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రామీణ విద్యార్థులకూ అత్యాధునిక విద్యాబోధన అందించే లక్ష్యంలో ప్రభుత్వం సక్సెస్‌పేరుతో ఆరోతరగతి నుంచి ఇంగ్లీష్ మాధ్యమాన్ని.. మూడోతరగతి నుంచే కంప్యూటర్ విద్యను ప్రవేశపెట్టింది. ఇప్పుడది గాడి తప్పింది. - న్యూస్‌లైన్, నక్కపల్లి

నక్కపల్లి, న్యూస్‌లైన్ :
ఇదీ పరిస్థితి
2008 సెప్టెంబరు15నుంచి రాష్ట్రవ్యాప్తంగా 5వేల పాఠశాలల్లో కంప్యూటర్ విద్యను ప్రారంభించింది.
ఐదేళ్లకుగాను ఎడ్యుకాం సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ప్రతిపాఠశాలకు 11 కంప్యూటర్లను కేటాయించింది. ఇదే క్రమంలో విశాఖ జిల్లాలో సుమారు 550 జడ్పీ పాఠశాలల్లోను కంప్యూటర్ విద్య ప్రారంభించారు.
కాల్ (కంప్యూటర్ ఎయిడెడ్ లెర్నింగ్ ప్రోగ్రాం )లోభాగంగా మండలానికి 3 చొప్పున117 యూపీ స్కూళ్లలోనూ కంప్యూటర్ విద్యను ప్రవేశపెట్టింది.
ప్రతి స్కూలుకూ ఇద్దరు బోధకులను నియిమంచారు.
ఏడాదిపాటు ఇది బాగానే కొనసాగినా సదరు అధ్యాపకులకు ఆ సంస్థ జీతాలు సరిగా ఇవ్వకపోవడంతో వారు ఉద్యోగాలు మానేశారు.తర్వాత నుంచి పాఠశాలల్లో విద్యార్థులకు అధ్యాపకులు కరువయ్యారు.
ఎడ్యుకాం సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం కూడా గతేడాది15తో పూర్తయింది. తర్వాతనుంచి ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదు.
కాంట్రాక్ట పూర్తయ్యేనాటికి సదరు కంప్యూటర్లను పక్కాగా పని చేసే స్థితిలో ఉంచి ఆయా స్కూళ్లకు అప్పగించాలన్నది ఒప్పందం కానీ చాలా పాఠశాలల్లో ఇవి మూలకు చేరాయి.
నాలుగేళ్లనుంచి పిల్లలు కంప్యూటర్ పాఠాలకు నోచుకోలేదు. విద్యాసంవత్సరం మరోమూడునెలల్లో ముగియనున్నా ప్రభుత్వం మాత్రం ప్రత్యామ్నాయ చర్యలుతీసుకోలేదు.

No comments: