MARQUEE

URGENT IMPORTANT APPEAL ACT ( Association for Computer Teachers ) అనే ఉద్యమం కంప్యూటర్ టీచర్లతో శ్రీకాకుళం లో నెమ్మదిగా ప్రారంభమయినది . 2011 జూలై 10వ తేదిన ఆవిర్భవించింది. సభ్యుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసింది. ఇతర సంఘాలతో భుజం కలిపి పోరాడింది. సమ్మెలకు ఉద్యమాలకు మారుపేరుగా నిలిచింది. కోర్దినేటర్ల వేధింపులకు ఏజెన్సీల మోసాలకు ఎదురు తిరిగింది. ఈ క్రమంలో అనేక మంది సభ్యులు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అన్ని జిల్లాలకు, రాష్ట్రమంతట ACT పేరు మారుమ్రోగింది. నిజాయితీకి నిర్భీతికి చిరునామాగా మారింది కనుకనే రాష్ట్ర స్థాయి సంఘంగా మారింది. చాలిచాలని జీతాలతో బ్రతుకులు ఈడుస్తున్న మన కంప్యూటర్ టీచర్ల దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పనిచేయ్య్లనేదే ACT ఉద్దేశ్యం. అందరి ఉపాధ్యాయుల వలె కంప్యూటర్ టీచర్లు గౌరవప్రదంగా జీవించాలనేదే ACT కర్తవ్యం. అందుకే ఏ రొజూ సభ్యుల నుంచి పైసాకుడా వసూలు చెయ్యలేదు. ఇకముందు కూడా వసూలు చెయ్యదు. వసులూ చేసే అధికారాన్ని ACT ఎవరికీ ఇవ్వలేదు. ACT పేరుతొ వస్తున్న ఈ మెయిల్స్ మరియు SMS లకు ఎవరు స్పందిచ వద్దని ఎవరికీ డబ్బులు చెల్లించవద్దని ACT STATE COMMITTEE కోరుతోంది ACT చందాలకు, వసూళ్ళకు, సభ్యత్వ రుసుములకు వ్యతిరేకం జై కంప్యూటర్ టీచర్ !!! జై జై ACT !!!

Thursday, December 5, 2013

ఎయిడెడ్‌ డిగ్రీ అధ్యాపకుల వేతన బకాయిలు చెల్లించాలి

- ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు 
Posted on: Thu 05 Dec 01:05:01.802558 2013  ప్రజాశక్తి-గుంటూరు
   ఎయిడెడ్‌ డిగ్రీ కళాశాలల అధ్యాపకులకు 2006యుజిసి వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. స్థానిక బ్రాడీపేటలోని యుటిఎఫ్‌ కార్యాలయంలో బుధవారం ఎయిడెడ్‌ డిగ్రీఅధ్యాపకుల సమావేశం జరిగింది. గురవయ్య డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎం.బోసుబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో లక్ష్మణరావు మాట్లాడారు. ప్రస్తుతం పనిచేస్తున్న, విశ్రాంత డిగ్రీ అధ్యాపకులకు 2006 పెండింగ్‌ బకాయిలు ఇంకా చెల్లించకపోవడం దారుణమని, బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌చేశారు. ఎపి ఎయిడెడ్‌ డిగ్రీ అధ్యాపకుల తరపున ముస్లిం కళాశాల అధ్యాపకులు డాక్టర్‌ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జులై 2009వరకూ ఉద్యోగ విరమణ చేసిన అధ్యాపకులకు, యూనివర్శిటీ, ప్రభుత్వ అధ్యాపకులకు మాత్రమే ప్రభుత్వం బకాయిలు చెల్లించిందని తెలిపారు. సమావేశంలో పాల్గొన్న వివిధ కళాశాలల అధ్యా పకులు ఈసందర్భంగా ఎమ్మెల్సీ లక్ష్మణరావుకు వినతిపత్రం సమర్పించారు. త్వరలో ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, కమిషనర్‌ తదితరులకు వినతిపత్రాలు సమర్పించాలని, సమస్య పరిష్కారంకాకుంటే హైకోర్టును ఆశ్రయించాలని సమావేశంలో తీర్మానించారు.

No comments: