MARQUEE

URGENT IMPORTANT APPEAL ACT ( Association for Computer Teachers ) అనే ఉద్యమం కంప్యూటర్ టీచర్లతో శ్రీకాకుళం లో నెమ్మదిగా ప్రారంభమయినది . 2011 జూలై 10వ తేదిన ఆవిర్భవించింది. సభ్యుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసింది. ఇతర సంఘాలతో భుజం కలిపి పోరాడింది. సమ్మెలకు ఉద్యమాలకు మారుపేరుగా నిలిచింది. కోర్దినేటర్ల వేధింపులకు ఏజెన్సీల మోసాలకు ఎదురు తిరిగింది. ఈ క్రమంలో అనేక మంది సభ్యులు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అన్ని జిల్లాలకు, రాష్ట్రమంతట ACT పేరు మారుమ్రోగింది. నిజాయితీకి నిర్భీతికి చిరునామాగా మారింది కనుకనే రాష్ట్ర స్థాయి సంఘంగా మారింది. చాలిచాలని జీతాలతో బ్రతుకులు ఈడుస్తున్న మన కంప్యూటర్ టీచర్ల దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పనిచేయ్య్లనేదే ACT ఉద్దేశ్యం. అందరి ఉపాధ్యాయుల వలె కంప్యూటర్ టీచర్లు గౌరవప్రదంగా జీవించాలనేదే ACT కర్తవ్యం. అందుకే ఏ రొజూ సభ్యుల నుంచి పైసాకుడా వసూలు చెయ్యలేదు. ఇకముందు కూడా వసూలు చెయ్యదు. వసులూ చేసే అధికారాన్ని ACT ఎవరికీ ఇవ్వలేదు. ACT పేరుతొ వస్తున్న ఈ మెయిల్స్ మరియు SMS లకు ఎవరు స్పందిచ వద్దని ఎవరికీ డబ్బులు చెల్లించవద్దని ACT STATE COMMITTEE కోరుతోంది ACT చందాలకు, వసూళ్ళకు, సభ్యత్వ రుసుములకు వ్యతిరేకం జై కంప్యూటర్ టీచర్ !!! జై జై ACT !!!

Tuesday, October 15, 2013

కంప్యూటర్ మిథ్య - Sakshi - Updated: October 14, 2013 03:33 (IST)

భద్రాచలం, న్యూస్‌లైన్ :జిల్లాలోని ఏజెన్సీ ప్రాంత ఆశ్రమ పాఠ శాలల్లో కంప్యూటర్ విద్యకు ప్రభుత్వం మంగళం పాడింది. గత రెండేళ్లుగా విద్యార్థులకు కంప్యూటర్ విద్య బోధించడం లేదు. నిధుల లేమి కారణంగా ఈ విషయంలో తామేమీ చేయలేమని ఐటీడీఏ అధికారులు సైతం చేతులెత్తేశారు. గిరిజన విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానం కల్పించి, వారి భవిష్యత్‌కు బంగారు బాటలు వేయాలనే లక్ష్యంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 2005లో ఐటీడీఏ పరిధిలోని అన్ని ఆశ్రమ ఉన్నత పాఠశాలల్లో కంప్యూటర్ విద్యను ప్రారంభించారు. దీనిపై ఎంతో శ్రద్ధ కనబరిచి భారీగా నిధులు కేటాయించారు. 
అయితే  ప్రస్తుత ప్రభుత్వం దీనిపై శ్రద్ధ చూపకపోవటంతో ఇక ఈ పథకానికి మంగళం పాడినట్లేనని పలువురు అభిప్రాయపడుతున్నారు.జిల్లాలో ఐటీడీఏ పరిధిలోని 41 ఆశ్రమ పాఠ శాలలో ‘గిరిప్రజ్ఞ’ పేరుతో 2005లో కంప్యూటర్ విద్యను ప్రవేశపెట్టారు. 3 నుంచి 9వ తరగతి వరకు చుదువుతున్న సుమారు 10 వేల మంది విద్యార్థులకు ప్రతి ఏటా ప్రయోజనం చే కూరేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. కంప్యూటర్ విద్యను బోధించేందుకు పాఠశాలకు ఇద్దరు చొప్పున 82 మంది వలంటీర్లను నియమించారు. వీరికి వేతనాలు, ఇతర నిర్వహణ వ్యయం కింద ఏటా రూ. 1.20 లక్షలు ఖర్చు చేశారు. 2005 నుంచి నాలుగేళ్ల పాటు విన్‌ఫో వేవ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారు కాంట్రాక్ట్ ప్రాతిపదికన కంప్యూటర్ విద్య నిర్వహణ బాధ్యతలు చూశారు. 
అయితే క్షేత్ర స్థాయిలో సరైన ఫలితాలు రాకపోవడమే కాకుండా వలంటీర్లకు సకాలంలో వేతనాలు ఇవ్వకపోవడం, కంప్యూటర్ల మరమ్మతులపై దృష్టి సారించడం లేదనే ఆరోపణల నేపథ్యంలో శరత్ ఐటీడీఏ పీవోగా ఉన్న సమయంలో ఆ బాధ్యతల నుంచి వారిని తప్పించారు. కంప్యూటర్ విద్య నిలిచిపోకూడదనే ఉద్దేశంతో ఈ బాధ్యతను రాజీవ్ విద్యామిషన్ ద్వారా  చేపట్టాలని శరత్ నిర్ణయించారు. కొంతకాలానికి నిధుల లేమితో బోధకులకు వేతనాలు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో గత విద్యా సంవత్సరం నుంచి ఆశ్రమ పాఠశాలల్లో కంప్యూటర్ విద్యాబోధన నిలిచిపోయింది. ప్రస్తుతం ఐటీడీఏ అధికారులు కూడా దీని గురించి పట్టించుకోకపోవటంతో విద్యాశాఖాధికారులు ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. 
మాయమైన కంప్యూటర్ సామగ్రి...
కొన్ని ఆశ్రమ పాఠశాలల్లో కంప్యూటర్ విద్యా బోధనకు సరఫరా చేసిన సామగ్రి మాయమైనట్లు తెలుస్తోంది. ఒక్కో పాఠశాలకు పది కంప్యూటర్లు, పది యూపీఎస్‌లు, సరిపడా సీడీలు, రెండేసి ప్రింటర్లు, మరో రెండు లేజర్ ప్రింటర్లు, రెండు డిజిటల్ కెమెరాలు, రెండు స్కానర్లు అందజేశారు. తక్కువ మంది పిల్లలు ఉన్న చోట ఏడు చొప్పున మొత్తం 250 కంప్యూటర్లు సరఫరా చేశారు. అయితే వీటిలో కంప్యూటర్లు మినహా మరే ఇతర వస్తువులు పాఠశాలల్లో కనిపించడం లేదు. 
 అవి ఏమయ్యాయనే దానిపై ఇప్పటి వరకూ తగిన పరిశీలన లేకపోవటంతో మిగిలిన వస్తువులను కూడా కొంతమంది ఉపాధ్యాయులు ఇళ్లకు తీసుకెళ్తున్నట్లు సమాచారం. ఐటీడీఏ పీవోగా ప్రవీణ్‌కుమార్ ఉన్న సమయంలో కంప్యూటర్ విద్యను గాడిలో పెట్టేందుకు వీటికి మరమ్మతులు చేయించారు. ఇందుకోసం రూ.2.69 లక్షలు ఖర్చు చేశారు. అయితే రిపేర్ల పేరుతో భద్రాచలం తీసుకొచ్చిన కంప్యూటర్ సామగ్రి కొంత తిరిగి పాఠశాలలకు వెళ్లలేదనే ఆరోపణలు అప్పట్లోనే వచ్చాయి. కానీ దీనిపై ఐటీడీఏ అధికారులు దృష్టి సారించకపోవటంతో కంప్యూటర్‌లు, స్కానర్‌లు, ప్రింటర్, కెమెరాలు చాలాచోట్ల మాయమవుతున్నాయి. ఐటీడీఏ అధికారులు దీనిపై దృష్టి సారిస్తే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని ఉపాధ్యాయ సంఘాలే అంటున్నాయి. 
 జడ్పీ పాఠశాలల్లోనూ మూసివేతేనా..? 
 జిల్లా పరిషత్ పాఠశాలల్లో కూడా కంప్యూటర్ విద్యా బోధిస్తున్నారు. సర్వశిక్షా అభియాన్ నిధులతో దీనిని అమలు చేస్తున్నారు. ఐదేళ్ల పాటు కంప్యూటర్ విద్యాబోధన చూసే బాధ్యతను ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్ గవర్నమెంట్ అనే సంస్థకు అప్పగించారు. వీరి కాంట్రాక్ట్ కాలపరిమితి ఈ నెలాఖరుతో ముగుస్తుంది. దీంతో ఇక జడ్పీ పాఠశాలల్లోనూ కంప్యూటర్ విద్యాబోధన అమలుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం అంతా కంప్యూటరైజేషన్‌తోనే పనులు సాగుతున్నాయి. ఉపాధి అవకాశాలు కూడా ఈ రంగంలోనే ఎక్కుగా ఉన్నాయి. కానీ ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ విద్యాబోధన సవాలక్ష సమస్యల నడుమ సాగుతుండటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  
 జడ్పీ పాఠశాలల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు : నాంపల్లి రాజేష్, ఏజెన్సీ డీఈవో 
 ఆశ్రమ పాఠశాలల్లో కంప్యూటర్ సామగ్రి అంతా మరమ్మతులకు గురయ్యాయి. వీటిని రిపేర్ చేసేందుకు పెద్ద మొత్తంలో నిధులు అవసరం. ఈ విషయాన్ని ఐటీడీఏ పీవో దృష్టికి కూడా తీసుకెళ్లాము. ఈ ఏడాది కంప్యూటర్ విద్యాబోధన అనుమానమే. అయితే భవిష్యత్‌లో దీన్ని పటిష్టంగా అమలు చేసేందుకు తగు కార్యాచరణ సిద్ధం చేస్తున్నాము.  జడ్పీ పాఠశాలల్లో ఈ నెలాఖరుతో కాంట్రాక్టు గడువు ముగుస్తున్నందున ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాము. ఆయా పాఠశాలల్లో  పనిచేసే ఒక ఉపాధ్యాయుడికి కంప్యూటర్ శిక్షణ ఇప్పించి విద్యా బోధన జరిగేలా దృష్టి సారించాము.

No comments: